Wednesday, August 5, 2026 10:49 AM
Wednesday, August 5, 2026 10:49 AM

చెవిరెడ్డికి బెయిల్.. ఆయన్ను మాత్రం వదలని హైకోర్ట్..!

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ఏడాది నుంచి అనేక సంచలనాలకు వేదికగా మారుతోన్న లిక్కర్ కేసులో కీలకంగా భావిస్తోన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి ఏపీ హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 220 రోజుల నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లోనే ఉన్నారు. గత ఏడాది జూన్ 17 న ఆయనను బెంగళూరులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కేసును విచారిస్తున్న సిట్ అధికారులకు అప్పగించారు.

Also Read : మాట జాగ్రత్త.. మంత్రులకు సిఎం వార్నింగ్

అప్పటి నుంచి బెయిల్ కోసం చెవిరెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఆయన తర్వాత అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి సహా పలువురు బెయిల్ పై బయటకు వచ్చారు. చెవిరెడ్డి ఏ39 గా ఉంటే విజయ సాయి రెడ్డి ఏ 5గా ఉంటే ఆయనను అరెస్ట్ చేయకుండా చెవిరెడ్డిని అరెస్ట్ చేసింది సిట్. నగదును విదేశాలకు తరలించడంలో చెవిరెడ్డి పాత్ర అత్యంత కీలకంగా భావించారు. కంటైనర్ లో దొరికిన డబ్బులో కూడా ఆయనదే కీలక పాత్రగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల కూడా ఆయన బెయిల్ కోసం ప్రయత్నం చేసారు.

Also Read : ఆధారాల్లేకుండా ఆరోపణలు… ఇదేనా సాక్షి జర్నలిజం?

అయితే అనారోగ్యంతో బాధపడటంతో కరకట్టపై ఉన్న మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలో ఆయన చికిత్స తీసుకునేందుకు కోర్ట్ అనుమతి ఇచ్చింది. తాజాగా హైకోర్ట్ బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు. ఆయనతో పాటుగా వెంకటేష్ నాయుడు, సజ్జల శ్రీధర్ రెడ్డికి కూడా కోర్ట్ బెయిల్ ఇచ్చింది. కానీ ఈ కేసులో కీలకంగా భావించే రాజ్ కేసిరెడ్డికి మాత్రం కోర్ట్ బెయిల్ ఇవ్వలేదు. అటు ఈడీ అధికారులు కూడా ఎంటర్ కావడంతో ఈ కేసులో పరిణామాలు ఎటు తిరుగుతాయా అనేది ఆసక్తిగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్