Wednesday, August 5, 2026 06:43 AM
Wednesday, August 5, 2026 06:43 AM

మహిళలకు గుండెపోటు ఛాన్స్ ఏ టైం లో అంటే…?

సాధారణంగా మహిళలకు గుండెపోటు అనేది కరోనాకు ముందు పెద్దగా మనం వినలేదు. కానీ కరోనా తర్వాత మహిళలకు కూడా గుండెపోటు రావడం అనేది సాధారణ విషయంగా మారిపోయింది. చిన్న వయసులో ఉన్న ఆడపిల్లలు కూడా గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే వైద్యులు మహిళలకు గుండెపోటు ఏ సమయంలో వస్తుందో హెచ్చరిస్తున్నారు. అలాగే మహిళలకు గుండెపోటు రావడానికి ప్రధాన కారణాలను కూడా తాజాగా వైద్యులు బయటపెట్టారు.

Also Read : ప్రియాంక మూడేళ్ళు బలి.. రాజమౌళి ప్లానింగ్ అదే

అధిక రక్తపోటుతో పాటుగా షుగర్ అలాగే మోనోపాజ్, ఒత్తిడి మొదలైనవి మహిళల్లో గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయని హెచ్చరించారు. హార్మోన్ల మార్పులు.. ముఖ్యంగా తెల్లవారుజామున మహిళల్లో గుండెపోటుకు దారితీస్తుందని హెచ్చరించారు. తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్యలో మహిళలకు ఎక్కువగా గుండెపోటు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు వెల్లడించాయి. మహిళలు చురుకుగా ఉండటం చాలా మంచిదని, అలాగే వారంలో ఎక్కువసార్లు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Also Read : ఓట్ల కోసం ఆల్‌ ఫ్రీ.. భారం ఎవరిపైనా..?

ఎక్కువ ఒత్తిడి కూడా గుండె సమస్యలను ప్రేరేపిస్తుందని హెచ్చరించారు. ప్రాణయామం అలాగే ధ్యానం, వాకింగ్ వంటివి గుండెపోటు సమస్యలను తగ్గించే అవకాశం ఉందని, పండ్లు కూరగాయలు తృణధాన్యాలుతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని సూచించారు. ఉప్పు చక్కెర మరియు కొవ్వు అధికంగా ఉండే ఆహారాలకు మహిళల దూరంగా ఉండటం ఉత్తమం అని తేల్చారు. కొంతమంది స్త్రీలకు తెల్లవారుజామున వికారం లేదంటే వాంతులు అలాగే తేలికపాటి తలనొప్పి ఉంటే జాగ్రత్త పడాలని, ఈ లక్షణాలు కొన్ని సార్లు ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఉండవచ్చని కానీ అది గుండె సమస్యల గురించి ఒక వార్నింగ్ లాంటిదని వైద్యులు తెలిపారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్