Wednesday, August 5, 2026 07:49 AM
Wednesday, August 5, 2026 07:49 AM

ఓటమి దిశగా ముగ్గురు సీఎంలు..!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ లో భారత రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సంచలనం నమోదవుతోంది. అధికార పీఠంపై ఉన్న ముగ్గురు సిట్టింగ్ ముఖ్యమంత్రులు తమ సొంత నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన కంచుకోట అయిన కొళత్తూర్ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. అక్కడ విజయ్ నేతృత్వంలోని టీవీకే అభ్యర్థి గట్టి పోటీ ఇస్తూ ఆధిక్యంలోకి వెళ్లడం డీఎంకే శ్రేణులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

Also Read : తమిళనాట రాజకీయ సంచలనానికి తెరలేపిన టీవీకే విజయ్..!

పశ్చిమ బెంగాల్‌లో 17 ఏళ్ల సుదీర్ఘ పాలన సాగించిన మమతా బెనర్జీకి ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భవానీపూర్‌లో ఆమెపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఫలితాల ట్రెండ్స్ చూస్తుంటే బెంగాల్ గడ్డపై దీదీ పాలనకు ఎండ్ కార్డ్ పడబోతున్నట్లు కనిపిస్తోంది. వరుసగా రెండుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్ కొడతారనుకున్న కేరళ సీఎం పినరయి విజయన్ కూడా ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. ధర్మదంలో యూడీఎఫ్ అభ్యర్థి ఆయనకు గట్టి సవాల్ విసురుతున్నారు.

Also Read : తమిళనాట ఎన్నికల ఫలితాలు.. తిరుమలలో త్రిష..!

హేమాహేమీలుగా భావించే ఈ ముగ్గురు నేతలు వెనుకబడటంతో ఆయా రాష్ట్రాల్లో అధికార మార్పిడి ఖాయమని సంకేతాలు అందుతున్నాయి. జనం తీర్పు ముగ్గురు సీఎంలను ఒకేసారి ఇంటికి పంపబోతుందా అన్న ఉత్కంఠ ఇప్పుడు నెలకుంది. ఇక తమిళనాడులో టీవీకే అధికారంలోకి వచ్చే అవకాశాలు కనపడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. పార్టీ ఏర్పాటు చేసిన రెండేళ్ళలోనే విజయ్ ఈ స్థాయిలో ప్రభావం చూపడం దేశ వ్యాప్తంగా సంచలనం అయింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్