భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తోన్న వైఖరిలో మార్పు రావడంతో.. భారత్ – అమెరికా సంబంధాల విషయంలో కీలక మార్పులు జరిగే అవకాశం కనపడుతోంది. అమెరికా సుంకాలను 18 శాతానికి తగ్గించడం, భారత్.. రష్యా నుండి చమురు కొనుగోలును నిలిపివేయడం , అమెరికా నుండి 500 బిలియన్ డాలర్ల ఇంధన, సాంకేతిక ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉండటం వంటివి ఇప్పుడు కీలకంగా మారాయి. ఈ తరుణంలో భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందం వచ్చే వారం ప్రారంభంలో జరిగే అవకాశం కనపడుతోంది.
Also Read : ఏ ఒక్కడినీ వదిలిపెట్టం.. చంద్రబాబు ఉగ్రరూపం
ఈ ఒప్పందంపై సంతకం చేసేందుకు అమెరికన్ సీనియర్ అధికారులు ఢిల్లీలో ఉంటారని జాతీయ మీడియా తెలిపింది. చర్చలు, ఒప్పందాలను వచ్చే వారం అధికారికంగా ప్రకటిస్తారు. పాడి, మత్స్య, ఇతర రైతు ఉత్పత్తులకు వచ్చే వారం గుడ్ న్యూస్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అదే విధంగా భారతీయులకు వీసా మంజూరు చేసే విషయంలో కూడా ట్రంప్ సర్కార్ కొన్ని కీలక ఇమ్మిగ్రేషన్ విధానాలను ప్రకటించే అవకాశం కనపడుతోంది. హెచ్ 1 బీ వీసాల విషయంలో కూడా కీలక ప్రకటన ఉండే అవకాశం ఉంది.
Also Read : ఇండియన్స్ కు సింగపూర్ రెడ్ కార్పెట్..!
హెచ్ 1 బీ వీసాలకు సంబంధించి ప్రతిష్టంభన కొనసాగుతోంది. హెచ్ 1 బీ వీసాల్లో భారతీయులే ఎక్కువగా ఉండటంతో.. కొంత ఆందోళన ఉంది. దీనికి వచ్చే వారం ముగింపు పలికే అవకాశం ఉంది. వెనిజులా, అమెరికా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలో భారత్ అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి పూర్తిగా చమురు ఉత్పత్తులను నిలిపివేయనుంది భారత్. ఇక సుంకాలు తగ్గడంతో భారత్ నుంచి పెద్ద ఎత్తున అమెరికాకు వస్త్ర సహా అనేక ఎగుమతులు ఉండనున్నాయి.

