Wednesday, August 5, 2026 05:01 AM
Wednesday, August 5, 2026 05:01 AM

ప్లీజన్నా రండి.. పార్టీ నేతలకు జగన్ రిక్వెస్ట్

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నానా కష్టాలు పడుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా గతంలో అన్నకు అండగా నిలిచి మేమున్నాం అంటూ తోడు నిలిచిన నాయకులు ఇప్పుడు అసలు వైసీపీ కేంద్ర కార్యాలయం వైపు చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. ముందు పార్టీని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం జగన్ కు పెద్ద సమస్య అయిపోయింది. కీలక నాయకత్వం మౌనంగా ఉండటంతో జగన్ లో ఆందోళన వేరే లెవెల్ లో ఉంది. అప్పుడప్పుడు బెంగళూరు వెళ్లి, పార్టీ కార్యాలయంలో అప్పుడో జిల్లాలో అప్పుడో జిల్లా మీటింగ్ లు పెడుతుంటే వర్కౌట్ కావడం లేదని జగన్ భావిస్తున్నారు.

Also Read : ఇదెక్కడి ట్విస్ట్, బుకింగ్ యాప్స్ లో పుష్పకు షాక్ ఇస్తున్న అమరన్

అందుకే అందరూ రేపు అందరూ తాడేపల్లి రావాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు. కాదు కాదు రిక్వస్ట్ చేస్తున్నారు. తన ఇగోని పక్కన పెట్టి వైసీపీ నాయకులకు ఫోన్ లు చేసారు జగన్. రేపు పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం కీలకంగా మారింది. సైలెంట్ గా ఉన్న నేతలు అందరూ తాడేపల్లి వచ్చేయండి కలిసి భోజనం చేద్దాం అని కూడా పిలిచారు జగన్. పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లు, జనరల్‌ సెక్రటరీలు, పార్టీ సెక్రటరీలు అందరూ హాజరు కానున్నారు. పార్టీ బలోపేతం, నిర్మాణంపై దృష్టి పెట్టి… వారి అభిప్రాయాలను తీసుకుంటారు జగన్.

Also Read : అదానితో ఒప్పందం రద్దు అయితే, పెనాలిటీ ఎన్ని వేల కోట్లంటే…!

పార్టీ పరంగా కమిటీల ఏర్పాటు, వాటి భర్తీపై చర్చ జరగనుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు కలుగుతున్న అనేక ఇబ్బందులపైనా చర్చిస్తారు. భారీగా కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డివిరుస్తున్న చంద్రబాబు సర్కార్‌ పై యుద్ధం చేయాలని జగన్ నాయకులకు పిలుపునివ్వనున్నారు. దీనిపైనా ఎలాంటి ఆందోళనలు నిర్వహించాలన్న దానిపై చర్చించనున్న వైయస్‌.జగన్‌… స్వయంగా తాను కూడా ఆందోళనల్లో పాల్గొనే ఆలోచనలో ఉన్నారు. ధాన్యం సేకరణ, రైతులను దోచుకుంటున్న దళారులు తదితర అంశాలపైనా చర్చ జరగనుంది. త్వరలోనే నిర్వహించే ప్రజా పోరాటాలపైనా చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంపై కార్యాచరణ సిద్దం చేసుకుని… వాటిని నేతలకు వివరిస్తారు జగన్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్