Wednesday, August 5, 2026 07:34 AM
Wednesday, August 5, 2026 07:34 AM

బాలయ్య పెట్టుకున్న నమ్మకాన్ని ప్రశాంత్ వర్మ నిలబెడతాడా..?

ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్న యంగ్ డైరెక్టర్లలో ప్రశాంత్ వర్మ ఒకరు. తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో బాగా కష్టపడుతున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక రీసెంట్ గా ఆయన చేసిన ‘హనుమాన్ సినిమాతో భారీ విజయంతో పాటు యువతలో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న ఆయన ఇప్పుడు ‘జై హనుమాన్’ సినిమాని చేస్తున్నాడు.

ఇక దీంతో పాటుగా బాలయ్య బాబు కొడుకుని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసే ఒక పెద్ద బాధ్యతను తన భుజాల మీదకి తీసుకున్నాడు. మరి ఈ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. బాలయ్య కొడుకు అయిన మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఆయన ఎంచుకున్న కథ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక సోషియో ఫాంటసీ కథతో ఆ సినిమాని తెరకెక్కించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారట. ఇప్పటికే కథ మొత్తాన్ని ఫినిష్ చేసి బాలయ్య బాబుకు వినిపించినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక బాలయ్య బాబు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న మోక్షజ్ఞ మొదటి సినిమాతోనే తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.

Read Also : దేవర కోసం సైఫ్ కష్టాలు.. మరీ ఈ రేంజ్ లోనా…?

ఇక మొదటి సినిమా కనక ఫ్లాప్ అయితే ఆయన మీద ప్రేక్షకుల్లో ఇంప్రెషన్ అనేది అంత పెద్దగా ఉండదు. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక బాలయ్య బాబు అంతగా నమ్మి మోక్షజ్ఞ ను ప్రశాంత్ వర్మ చేతిలో పెడితే ఆయన ఎలాంటి క్రెడిట్ ని మోక్షజ్ఞ కి అందిస్తాడు అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. మరి ప్రశాంత్ వర్మ మీద బాలయ్య బాబు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాడా లేదా అనేది చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్