Thursday, May 28, 2026 12:01 AM
Thursday, May 28, 2026 12:01 AM

మాజీ సీఎం అరెస్ట్ కు రంగం సిద్దం..?

కేరళ రాజకీయాల్లో సంచలనాల దిశగా అడుగులు పడుతున్నాయి. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం సీనియర్ నేత పినరయి విజయన్ నివాసాలే లక్ష్యంగా ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విస్తృత సోదాలు చేపట్టారు. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారంలో ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఈడీ అధికారులు కేంద్ర రిజర్వ్ బలగాల రక్షణతో తెల్లవారుజాము నుంచే సోదాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

Also Read : బాలీవుడ్ ను రంగంలోకి దించుతున్న కొరటాల..!

తిరువనంతపురంలోని బేకరీ జంక్షన్ వద్ద పినరయి విజయన్ నివాసం ఉంటున్న అద్దె ఇల్లు, అలాగే కన్నూర్‌ లోని ఆయన స్వగృహంలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. విజయన్‌ తో పాటు కేరళవ్యాప్తంగా దాదాపు 12 కీలక ప్రాంతాలలో ఈ సోదాలు కొనసాగాయి. ఇందులో విజయన్ కుమార్తె వీణ విజయన్ భర్త, మాజీ మంత్రి పి.ఎ. మహమ్మద్ రియాస్ నివాసం కూడా ఉంది. సోదాల సమయంలో పినరయి విజయన్ కుటుంబ సమేతంగా ఇంట్లోనే ఉన్నారు. ఈ వివాదం పినరయి విజయన్ కుమార్తె టి. వీణకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ అనే ఐటీ సంస్థ చుట్టూ తిరుగుతోంది.

Also Read : అఖిల్ కెరీర్ మార్చే సినిమా ఇదేనా?

ప్రైవేట్ మైనింగ్ కంపెనీ అయిన సీఎంఆర్‌ఎల్ నుంచి 2017-2021 మధ్య కాలంలో ఎక్సాలాజిక్ సంస్థకు ఎలాంటి ప్రత్యక్ష సేవలు అందించకుండానే రూ. 1.72 కోట్ల మేర అక్రమంగా చెల్లింపులు జరిగాయనేది ప్రధాన ఆరోపణ. ఈ ఆర్థిక లావాదేవీలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి విచారణను వేగవంతం చేసింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కూడా ఈ వ్యవహారంపై ఇప్పటికే నివేదిక ఇచ్చింది. ఈ కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను, విచారణను సవాల్ చేస్తూ సీఎంఆర్‌ఎల్ సంస్థ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, ప్రాథమికంగా మనీలాండరింగ్ ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొంటూ హైకోర్టు మంగళవారమే ఆ పిటిషన్‌ ను కొట్టేసింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

2029 ఎన్నికల పై...

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో...

మోదీ సర్కార్‌కు పుష్కరం.....

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో...

మన టార్గెట్.. జెన్...

తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు...

సిద్దు అవుట్.. డీకే...

కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కాయి. కర్ణాటకలో అధికారంలో...

తాడేపల్లి నుంచి జగన్...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామాలకు...

టీపీసీసీ గౌడ్‌కు పొగ.....

ఏం జరిగిందో తెలియదు. ఏం జరుగుతుందో...

పోల్స్