ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం ఇప్పట్లో ఆగే సంకేతాలు కనపడటం లేదు. రోజు రోజుకి ఇరాన్ తన సైనిక చర్యల వేగం పెంచుతూనే ఉంది. ఏ ప్రాంతం మీద ఆ రెండు దేశాలు దాడి చేసినా.. తాను చేయాలనుకున్నది ఇరాన్ చేసి చూపిస్తోంది. గల్ఫ్ దేశాలతో పాటుగా ఇజ్రాయిల్ రాజధానిపై బాంబుల వర్షం కురిపిస్తోంది. కీలక ప్రాంతాల్లో ఉన్న ఆయిల్ డిపోలను ఇరాన్.. లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. అటు గల్ఫ్ దేశాలకు సారీ చెప్పినట్లే చెప్పి.. తమ దాడులను వేగవంతం చేసింది.
Also Read : ఆఫ్ ది రికార్డు.. కొలికపూడి గురించే..!
ఇక తాజాగా ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ కీలక ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపై ఇరాన్ ఘాటుగా రియాక్ట్ అయింది. ఇరాన్లో యుద్ధాన్ని ఎప్పుడు ముగించాలో తమకు తెలుసు అంటూ ట్రంప్ చేసిన కామెంట్స్ పై సీరియస్ అయింది. యుద్ధం ఎప్పుడు ఆపాలో నిర్ణయం తీసుకునేది తామే అంటూ క్లారిటీ ఇచ్చింది. యుద్ద భవిష్యత్తు తమ బలగాల చేతుల్లో ఉందని పేర్కొంది. త్వరలోనే యుద్ధం ఆగిపోతుంది అంటూ ట్రంప్ ఇటీవల కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read : ఆ ఇద్దరికే గంభీర్ క్రెడిట్.. ఎవరూ ఊహించని పేర్లు..!
అమెరికా దళాలు.. యుద్దాన్ని ముగించలేవు అంటూ స్పష్టం చేసింది. అటు ఇజ్రాయిల్ పై అమెరికా సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. గత వారం చివర్లో ఇరాన్ లోని 30 ఆయిల్ డిపోలపై ఇజ్రాయిల్ బలగాలు చేసిన దాడులపై అమెరికా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కథనాలు వచ్చాయి. ఇక హార్మోజ్ జల సంధిని ఇరాన్ మూసి వేయడంతో అమెరికాపై ఒత్తిడి పెరుగుతోంది. ఇరాన్ ను బెదిరించినా దాడులు చేసినా సరే.. హార్మోజ్ విషయంలో వెనక్కు తగ్గకపోవడంతో అమెరికాపై ప్రపంచ దేశాలు ఒత్తిడి పెంచుతున్నాయి.

