దేశంలో వాహన ప్రమాదాలు పెరిగిపోతున్న నేపధ్యంలో.. కేంద్రం కీలక అడుగులు వేస్తోంది. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపధ్యంలో కేంద్రం 2026 చివరి నాటికి వెహికల్ టూ వెహికల్ (V2V) కమ్యూనికేషన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ వ్యవస్థ ద్వారా వాహనాలు నెట్వర్క్ అవసరం లేకుండా ఒకదానితో ఒకటి నేరుగా కనెక్ట్ కావడానికి అవకాశం దొరుకుతుంది. దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతను బలోపేతం చేయడం, ప్రమాదాలను తగ్గించడం దీని లక్ష్యం.
Also Read : వెనిజులా చమురు భారత్ కు..? అమెరికా సంచలన నిర్ణయం..!
ముఖ్యంగా పార్క్ చేసిన వాహనాలు, వెనుక నుండి వేగంగా వెళ్లే వాహనాల ప్రమాదాలను నివారించడంలో ఈ సాంకేతికత ప్రభావవంతంగా ఉంటుందని భావిస్తున్నారు. దట్టమైన పొగమంచు సమయంలో పెద్ద ఎత్తున గుంతలు ఉన్నప్పుడు ఇబ్బందులు రాకుండా ఉండటానికి అడుగులు వేస్తోంది. ఈ వ్యవస్థ ద్వారా, వాహనాలు సిగ్నల్ లను ఒకదానితో ఒకటి మార్పిడి చేసుకుంటాయి. మరొక వాహనం ప్రమాదకరంగా దగ్గరగా వచ్చినప్పుడు డ్రైవర్లకు వార్నింగ్ సిగ్నల్ ఇస్తాయి. రాష్ట్రాల రోడ్డు రవాణా మంత్రులతో జరిగిన వార్షిక సమావేశం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ వివరాలు బయటపెట్టారు.
Also Read : గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు ఏంటీ..? గుర్తించటం ఎలా ?
సమావేశంలో ఈ విషయంపై చర్చించామని, ఈ సాంకేతికత త్వరలో అమలు చేస్తామన్నారు. ముఖ్యంగా రోడ్లపై వాహనాలు నిలిపి ఉంచినప్పుడు, మంచు కారణంగా ప్రమాదాలు జరుగుతోన్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న బస్సుల్లో అగ్నిమాపక యంత్రాలు, డ్రైవర్లకు నిద్రమత్తును గుర్తించే వ్యవస్థలు, ప్రయాణీకులకు అత్యవసర పరికరాలు వంటి వాటిని అమర్చనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలలో మాత్రమే ఇటువంటి సాంకేతికత ప్రస్తుతం వాడుకలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.5,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

