Saturday, September 19, 2026 09:54 AM
Saturday, September 19, 2026 09:54 AM

టిడిపి కండువా కప్పుకునేందుకు సిద్దమైన వాసిరెడ్డి

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. వైసీపీకి ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ ఎంపీలు అలాగే ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వారిలో కొంతమంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ కాగా మరికొందరు బిజెపిలో అలాగే జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. త్వరలోనే ఆ పార్టీ నుంచి మరికొన్ని చేరికలు కూటమి పార్టీలలో ఉండే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ తరుణంలో మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా వైసీపీకి రాజీనామా చేసారు.

Also Read : అక్రమ దందా.. ఎస్పీపైనే అనుమానాలు అన్నీ…?

రాజీనామా చేసిన సందర్భంగా ఆమె జగన్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. జగన్ మానసిక పరిస్థితి గురించి, ఆయన చేసే రాజకీయం గురించి గత ప్రభుత్వ పాలన గురించి ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె విజయవాడ ఎంపీ కేసినేని చిన్నిని కలిసి పార్టీలో చేరికపై చర్చించారు. తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు ఆమె ముందు నుంచి ఆసక్తిగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యేందుకు ఆమె సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Also Read :అల్లు అర్జున్ కు వైసీపీ బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసింది

అయితే ప్రస్తుతం తనకు పార్టీలో పదవులు ఏమీ వద్దని ఎటువంటి అభ్యర్ధనలు లేకుండానే పార్టీలో జాయిన్ అవుతానని ఆమె చెప్పినట్లుగా సమాచారం. కేసినేని చిన్ని వద్ద ఇదే విషయాలను వాసిరెడ్డి పద్మ ప్రస్తావించారు. అలాగే తనతో పాటుగా మరో మహిళ నేత కూడా పార్టీ మారెందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఆమె ఎప్పుడు జాయిన్ అవుతారు అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా వాసిరెడ్డి పద్మ విషయంలో పెద్దగా ఆగ్రహంగా లేరు. మరికొందరు కార్యకర్తలు ఆమె తెలుగుదేశం పార్టీలోకి వస్తే అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించాలి అంటూ పార్టీకి సూచనలు కూడా ఇస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

పోల్స్