Wednesday, August 5, 2026 04:14 AM
Wednesday, August 5, 2026 04:14 AM

వాళ్ళు అమెరికా వదిలేయాల్సిందేనా…? సంచలనంగా ట్రంప్ నిర్ణయం…!

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి వాతావరణం కాస్త హాట్ హాట్ గానే కనపడుతోంది. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అనే ఆందోళన మొదలైంది. సంచలన నిర్ణయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డోనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు డిపెండెంట్ లకు చుక్కలు చూపించేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై గురి పెట్టిన ట్రంప్.. వీసా గడువు ముగిసినా ఇంకా అమెరికాలో ఉండే వారిపై ఎక్కువగా ఫోకస్ పెట్టేసారు.

Also Read : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్డేట్…!

వీరిలో ఎక్కువ మంది భారతీయులు అమెరికాలో నివాసం ఉంటున్నారు. ట్రంప్ వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా సరే లక్షల మంది భారతీయులపై ఆ ప్రభావం పడే అవకాశం కనపడుతోంది. హెచ్1బీ వీసా పొందిన వారిపై ఆధారపడిన వారు అంటే… వారి పిల్లలు డిపెండెంట్ వీసా-హెచ్4 కింద అమెరికాకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడకు వెళ్లిన మైనర్లకు 21 ఏళ్లు వచ్చే వరకు ఈ వీసా వర్క్ అవుతుంది. అక్కడి నుంచి రెండేళ్ళు సమయం ఇస్తారు. ఆ లోపు కొత్త వీసా ఇస్తారు. డిపెండెంట్ వీసాపై వెళ్లిన లక్షా 34 వేల మంది భారతీయుల వీసాల గడువు అయిపొయింది.

Also Read : భారత్ ఆ ఇద్దరినీ ఆపుతుందా…?

దీనితో వీసా గడువు ముగిసిన వారు తట్టా బుట్టా సర్దుకుని ఇండియా రావాల్సిందే అనే సంకేతాలు ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఒక అవకాశం ఉంది. వీసా గడువు ముగిసే వాళ్లు ఉన్నత చదువుల కోసం స్టూడెంట్ వీసా ఎఫ్-1కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కాని ఇది కూడా ఇప్పుడు అక్కడ కష్టంగానే కనపడుతోంది. స్టూడెంట్ వీసా పొందితే.. అంతర్జాతీయ విద్యార్థుల కింద నమోదు చేస్తారు. ఇలా జరిగితే ఫ్యూచర్ లో స్కాలర్‌షిప్ సహా ఇతర ప్రభుత్వ సాయానికి వారు అర్హులు కాదు. దీనితో వారు ఇండియా తిరిగి రావడమే ఏకైక ఆప్షన్ అంటున్నారు నిపుణులు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్