Tuesday, August 4, 2026 11:38 PM
Tuesday, August 4, 2026 11:38 PM

ఆదుకోండి ప్లీజ్.. అంతర్జాతీయ సమాజానికి పాక్ విజ్ఞప్తి

భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం తారస్థాయికి చేరుకుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో రెండు దేశాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత ఆర్మీ ప్రతీకార దాడులకు దిగింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ భూభాగం పై నేరుగా భారత వైమానిక దళం దాడి చేసింది. ఆ తర్వాత పరిస్థితులు వేగంగా మారుతూ వస్తున్నాయి. ఇక పాకిస్తాన్ కూడా భారత నగరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది.

Also Read : మన సైన్యం బలమెంత.. యుద్ధం వస్తే పాక్ పరిస్థితి ఏంటీ..?

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి వస్తున్న డ్రోన్ అలాగే క్షిపణులను భారత్ సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఉగ్రవాదం పై పోరు కోసం అమెరికా ఇచ్చిన విమానాలను కూడా పాకిస్తాన్.. భారత్ పై యుద్ధానికి వాడుకోవడం ఆశ్చర్యం కలిగించింది. ఇదిలా ఉంచితే పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకీ దారుణంగా మారుతుంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే పతనావస్థలో ఉండగా భారత్ చేస్తున్న దాడులతో మరింత దారుణంగా మారింది. ఒకవేళ యుద్ధం వస్తే అడ్డుకునేందుకు పాకిస్థాన్ వద్ద సమర్థవంతమైన వనరులు కూడా లేవు.

Also Read : అందరి పేర్లు రాసిపెట్టుకోండి..జగన్ 2.0లో తేలుస్తా..!

తాజాగా దేశ స్టాక్ మార్కెట్లు కూడా పతనం కావడంతో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో పడింది. భారత్ ఇదే విధంగా దాడులు కొనసాగిస్తే మాత్రం పాకిస్తాన్ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయే అవకాశాలు ఉన్నాయి. దీనితో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తమ దేశానికి సాయం చేయాలంటూ అంతర్జాతీయ సమాజాన్ని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. తమ దేశానికి ఆర్థిక సహాయం చేయాలని రుణాలు ఇవ్వాలి అని కోరుతోంది. భారత్ చేసిన దాడులతో.. తన దేశ స్టాక్ మార్కెట్ కూడా కుప్పకూలిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. అటు పాకిస్తాన్ ప్రజలు కూడా సోషల్ మీడియాలో తమను అంతర్జాతీయ సమాజం ఆదుకోవాలని పోస్టులు పెడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్