Wednesday, August 5, 2026 11:23 AM
Wednesday, August 5, 2026 11:23 AM

తెలంగాణాపై మీనాక్షి గురి.. యాక్ట్ చేస్తే తాట తీస్తాం..!

తెలంగాణా కాంగ్రెస్ లో నేతల మధ్య విభేదాలు, కోవర్టుల వ్యవహారంతో చికాకు పడుతున్న కాంగ్రెస్ అధిష్టానం.. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గా మీనాక్షి నట రాజన్ ను రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. ఇక రెండు రోజుల నుండి గాంధీ భవన్ లో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు ఆమె. నిన్న ఉదయం మెదక్, మధ్యాహ్నం మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ నేతల తో ప్రత్యేక భేటీ అయ్యారు. ఈ రోజు ఉదయం, పీసీసి అధ్యక్షుడి తో కలిసి సీఎం తో సమావేశం అయ్యారు. కార్పొరేషన్ పోస్ట్ లు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు, పీసీసీ కమిటీలపై సీఎం తో చర్చించారు.

Also Read : రజనీ కేసులపై ఏసీబీ కీలక నిర్ణయం…!

అనంతరం గాంధీ భవన్ లో అనుబంధ సంఘాలతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం ఆదిలాబాద్ పార్లమెంట్ నేతలతో భేటీ అయ్యారు. నేతల నుండి అభిప్రాయం తీసుకుంటున్న మీనాక్షి నటరాజన్.. పార్టీ లైన్ దాటితే వేటు తప్పదని హెచ్చరికలు జారీ చేసారు. అంతర్గత విషయాలు మీడియా ముందు మాట్లాడొద్దని అల్టిమేటం జారీ చేసారు. పార్టీలో కష్టపడ్డ వారికి కచ్చితంగా అవకాశం ఉంటుందని హామీ ఇచ్చారు. నియోజకవర్గాల వారిగా నేనే స్వయంగా డాటా తెప్పించుకుంటా అని చెప్పిన ఆమె.. ఎవరూ కంగారు పడవద్దని స్పష్టం చేసారు.

Also Read : రాజ్యసభ సీటుపై కూటమి సంచలన నిర్ణయం…?

ఇక అనుబంధ సంఘాల భేటీలో పనితీరు నివేదికలు ఇచ్చారు పలువురు నేతలు. మీరు నివేదికలు ఇవ్వకపోయినా ఎవరి పనితీరు ఏంటని తెలుసన్నారు ఆమె. పని చేస్తుంది ఎవరు… యాక్టింగ్ చేస్తుంది ఎవరనేది కూడా తెలుసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. పార్టీ కోసం సమయం ఇవ్వండని సూచించారు. పార్టీ అంతర్గత విషయాలు బయట చర్చ చేస్తే అలాంటి వారిపై చర్యలు తప్పవు అని హెచ్చరించారు. నా పనితీరు నచ్చకపోయినా… రాహుల్ గాంధీ…సోనియా గాంధీకి ఫిర్యాదు చేయొచ్చని కానీ బయట మాట్లాడకండన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్