Wednesday, August 5, 2026 11:06 AM
Wednesday, August 5, 2026 11:06 AM

కేంద్ర కేబినెట్ లోకి జనసేన ఎంపీ…?

దక్షిణాది రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. గతంలో దక్షిణాది రాష్ట్రాల విషయంలో చిన్న చూపు చూసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నిధుల విషయంలో కూడా కాస్త పెద్ద చేయి అందిస్తోంది. ఇదే సమయంలో రాజకీయ పార్టీలకు కూడా బిజెపి నుంచి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జనసేన, తెలుగుదేశం పార్టీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇతర కేంద్ర మంత్రులు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారు.

Also Read : ఎమ్మెల్యే పెత్తనం.. కార్యకర్త నరకం.!

గత ఏడాది పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీని కేంద్ర క్యాబినెట్లోకి తీసుకున్నారు. అదే సమయంలో జనసేన పార్టీ నుంచి కూడా క్యాబినెట్ లో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉందని భావించారు. కానీ కొన్ని కారణాలతో పదవి కేటాయించలేకపోయారు. అయితే డిసెంబర్ లో జరగబోయే కేంద్ర క్యాబినెట్ మార్పుల్లో భాగంగా జనసేన పార్టీకి అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే జనసేన క్లారిటీ కూడా ఇచ్చినట్లు సమాచారం. దాదాపుగా బందరు ఎంపీ బాలసౌరి కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.

Also Read : ఆస్ట్రేలియా వెళ్ళండి.. సీనియర్లకు బోర్డు ఆర్డర్

ఆయనకు కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు ఉండటమే కాకుండా.. కష్టపడే తత్వం ఉన్న నాయకుడిగా కూడా గుర్తింపు ఉంది. 2019లో బందరు నుంచి తొలిసారి గెలిచిన బాలసౌరి ఆ తర్వాత నియోజకవర్గానికి పెద్దపీట వేశారు. ఎంపీ నిధులను భారీగా ఖర్చుపెట్టారు. సొంత డబ్బు కూడా ఖర్చు చేస్తారు అనే పేరు ఉంది. దానికి తోడు తెలుగుదేశం పార్టీతో కూడా ఆయన సన్నిహితంగానే ఉంటారు. దీనితో ఇవన్నీ లెక్కేసుకుని బిజెపి ఆయనను క్యాబినెట్లోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు పలికినట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్