ఎట్టకేలకు మధ్యప్రాచ్యంలో యుద్ధం మొదలైంది. గత వారం రోజుల నుంచి యుద్ధం జరుగుతుందా లేదా అనే సందేహాలకు ఇజ్రాయిల్ బలగాలు నేడు.. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై జరిగిన క్షిపణి దాడులతో క్లారిటీ ఇచ్చేసాయి. ఇజ్రాయిల్ నిఘా విభాగాల ఆఫీసులు, రక్షణ రంగ ఆఫీసులతో పాటుగా కీలక సైనికుల కార్యాలయాలను కూడా టార్గెట్ గా చేసుకుని ఇజ్రాయిల్ దాడులకు దిగింది. వెంటనే అమెరికా కూడా ఇరాన్ పై దాడులకు దిగడంతో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది.
Also Read : బ్రేకింగ్ : పాక్ కు చుక్కలు చూపిస్తున్న ఆఫ్ఘన్ సైన్యం
అమెరికా సహాయంతో ఇజ్రాయిల్ ఈ దాడులకు దిగినట్టు తెలుస్తోంది. అటు ఇరాన్ కూడా ఇదే స్థాయిలో స్పందించడం మొదలుపెట్టింది. ఇరాన్ దాడులను ఏరియల్ డిఫెన్స్ అర్రే ప్రస్తుతం దాడులను గుర్తించి అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక ఇరాన్ నుండి ఇజ్రాయెల్ వైపు ప్రయోగించిన క్షిపణులను గుర్తించిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో సైరన్లు మోగించారు. ఇరాన్ లో ఇజ్రాయెల్-అమెరికా దాడులు సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కార్యాలయాల సమీపంలో జరిగినట్లు తెలుస్తోంది.
Also Read : ఢిల్లీలో స్వామిని యాక్టివేట్ చేసిన జగన్..?
దాడులతో 86 ఏళ్ల ఖమేని.. టెహ్రాన్ నుంచి సురక్షిత ప్రదేశానికి అధికారులు తరలించారు. దాడి తర్వాత ఇరాన్ – ఇజ్రాయెల్ తమ వైమానిక ప్రాంతాన్ని మూసివేసాయి. ఇజ్రాయిల్ కు ఇరాన్ కూడా అదే స్థాయిలో బదులు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. అమెరికాకు సహకరిస్తున్న దేశాలపై కూడా ఇరాన్ దాడులకు దిగింది. బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ దాడి చేసింది. ఒకేసారి 8 దేశాలపై మిస్సైళ్లు ఇరాన్ ప్రయోగించింది. ఇజ్రాయెల్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియాతో పాటు అబుదాబి, ఖతార్, యూఏఈ, జోర్డాన్పై ఇరాన్ దాడులు చేసింది.

