తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన దళపతి విజయ్, మహిళల భద్రత మరియు ఆత్మగౌరవం విషయంలో తన ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించబోతోందో అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. ఇటీవల నటి త్రిషను ఉద్దేశించి కొందరు నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా ఈ అంశంపై స్పందిస్తూ, బాధ్యతారహితంగా ప్రవర్తించే వారిపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Also Read : ఫోటోలు ఫ్లెక్సీల కోసం కొట్టుకోవద్దు: చంద్రబాబు
సమాజంలో మహిళల స్థానాన్ని కించపరిచేలా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం విజయ్ తేల్చి చెప్పారు. “రాజకీయ విమర్శల పేరుతో మహిళల వ్యక్తిగత విషయాలను వీధిలోకి లాగి మాట్లాడితే చూస్తూ ఊరుకోం. ఏ రంగంలో ఉన్న మహిళలకైనా సమాజంలో గౌరవం లేకుండా మాట్లాడితే సహించేది లేదు. ముఖ్యంగా మహిళలపై సోషల్ మీడియాలో లేదా బహిరంగంగా అసభ్యకర వ్యాఖ్యలు చేసే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం” అని ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా గట్టి వార్నింగ్ ఇచ్చారు.
Also Read : ఏపిలో కొత్త పెన్షన్లకు పచ్చజెండా.. ఎలా దరఖాస్తు చేయాలంటే..!
రాజకీయాల్లో ప్రజా సమస్యలపై ఆరోగ్యకరమైన విమర్శలు ఉండాలి తప్ప, మహిళల వ్యక్తిగత జీవితాలపై బురదజల్లడం సరికాదని విజయ్ హితవు పలికారు. ముఖ్యమంత్రి హోదాలో మహిళల ఆత్మగౌరవానికి పూర్తి అండగా నిలబడుతూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై తమిళనాడు వ్యాప్తంగా, ముఖ్యంగా సినీ మరియు రాజకీయ వర్గాల్లోని మహిళా లోకం నుండి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మహిళల రక్షణ విషయంలో తమ ప్రభుత్వం ఎటువంటి రాజీ పడబోదని ఈ సందర్భంగా విజయ్ స్పష్టం చేశారు.

