Wednesday, August 5, 2026 07:52 AM
Wednesday, August 5, 2026 07:52 AM

అఖిల్ కోసం.. పూరి స్టోరీ రెడీ.. నాగార్జున నమ్మకం అదే..?

చాన్నాళ్ళ నుంచి హిట్టు కోసం ఎదురుచూస్తున్న అక్కినేని ఫ్యామిలీ ఎట్టకేలకు తండేల్ అనే సినిమాతో 100 కోట్ల సినిమా రుచి చూసింది. ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయి దాదాపు 120 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అల్లు అరవింద్ నిర్మాతగా వచ్చిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి అఖిల్ కూడా హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎలాగైనా సరే తన తర్వాత సినిమాతో హిట్టు కొట్టి టాలీవుడ్ కు తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవాలని కష్టపడుతున్నాడు.

Also Read : కోహ్లీతో రాహుల్ బాండింగ్ వేరే లెవెల్..!

ప్రస్తుతం లెనిన్ అనే సినిమాలో అక్కినేని అఖిల్ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా 20% కంప్లీట్ అయినట్టు టాక్. ఈ ఏడాది దసరా టైం కు సినిమాను రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ టార్గెట్ గా పెట్టుకుంది. ఈ సినిమా తర్వాత అఖిల్.. పూరి జగన్నాద్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు అనే వార్తలు వచ్చాయి. ఎప్పటినుంచో దీనిపై ప్రచారం జరుగుతున్నా.. తాజాగా ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తికర విషయాన్ని బయటపెట్టేసాయి. అఖిల్ తండ్రి నాగార్జున.. పూరి జగన్నాథ్ తో మాట్లాడారని టాక్.

Also Read : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్డేట్…!

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో సినిమాను నిర్మించేందుకు ఒప్పించారని.. దీనితో పూరి జగన్నాథ్ కూడా ఇప్పుడు ఒక పవర్ఫుల్ కథను రెడీ చేసుకుని అఖిల్ కు మంచి హిట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడని వార్తలు వస్తున్నాయి. గతంలో నాగార్జునతో పూరి జగన్నాద్.. శివమణి, సూపర్ సినిమాలను చేశాడు. ఈ సినిమాల్లో శివమణి.. రికార్డులు క్రియేట్ చేసింది. సినిమా ఎలా ఉన్నా హీరోని స్క్రీన్ పై ఏ రేంజ్ లో చూపించాలో పూరీకి ఓ క్లారిటీ ఉంటుంది. గత కొన్నాళ్ల నుంచి ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న పూరి.. ఈ సినిమాతో లైన్లోకి రావాలని కష్టపడుతున్నాడు. అటు గోపీచంద్ హీరోగా కూడా ఒక సినిమాను ప్లాన్ చేసినట్లు ప్రచారం జరిగింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్