Wednesday, August 5, 2026 07:53 AM
Wednesday, August 5, 2026 07:53 AM

ఏపీ పోలీసులకి బెదిరింపు ఫోన్ కాల్స్

ఆంధ్రప్రదేశ్ లో గత అయిదేళ్లుగా సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు ఒక్కొక్కరిని అరెస్ట్ లు చేస్తున్నారు. గత నాలుగు నెలల నుంచి చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న పోలీసులు ఎట్టకేలకు ఇప్పుడు రంగంలోకి దిగారు. ఇష్టం వచ్చినట్టు పోస్ట్ లు పెడుతూ… అభ్యంతరకరంగా మార్ఫింగ్ లు చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. పోలీసుల వ్యవహారశైలిపై ప్రభుత్వ పెద్దలు సీరియస్ గా ఉండటంతో ఇన్నాళ్ళు ధీమాగా ఉన్న వైసీపీ బ్యాచ్ లో ఆందోళన మొదలయింది.

Also Read: టార్గెట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా మృగాల వేట మొదలైంది

వర్రా రవీంద్రా రెడ్డిని, కళ్ళం హరి కృష్ణా రెడ్డి, ఇంటూరి రవి కిరణ్ సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరికృష్ణా రెడ్డికి న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించింది. ఈ నేపధ్యంలో వైసీపీ అగ్ర నాయకత్వం అలెర్ట్ అవుతోంది. పోలీసులకు ఫోన్ లు చేసి… కార్యకర్తలను వదిలిపెట్టాలని బెదిరించడం గమనార్హం. ఈ రోజు ఉదయం పులివెందులలో రాఘవ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడానికి వెళ్ళిన పోలీసులను ఓ కీలక నేత ఫోన్ చేసి బెదిరించారని సమాచారం. అందుకే పోలీసులు వెనక్కు తిరిగి వెళ్లారట.

Also Read: టార్గెట్ వర్రా కాదా…? అసలు ఏం జరుగుతోంది…?

ఇక కళ్ళం హరికృష్ణా రెడ్డికి కోర్ట్ రిమాండ్ విధించకముందు… వదిలేయాలని పోలీసులను బెదిరించారట కొందరు. ఇక వర్రా విషయంలో ఏం జరుగుతుంది అనే దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. కాని అతన్ని వదిలిపెట్టాల్సిందే అనే బెదిరింపులు రావడంతో పోలీసులు కంగారు పడుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే వైసీపీ నేతలను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందనే వార్తల నేపధ్యంలో అధిష్టానం అలెర్ట్ అయినట్టు సమాచారం. ఎస్పీలను కూడా బెదిరించే స్థాయికి వైసీపీ నేతలు వెళ్ళారు అనే వార్తలు వస్తున్నాయి. ఇక పోలీసులను బెదిరిస్తూ వైసీపీ నేతలు ప్రసంగాలు చేయడం గమనార్హం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్