Saturday, August 15, 2026 03:56 AM
Saturday, August 15, 2026 03:56 AM

ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై మహిళ ఆరోపణల్లో నిజమెంత?

ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో అక్రమ సంబంధాల వ్యవహారాలు, వాటికి సంబంధించిన వీడియోలు ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పటి వరకు వైసీపీ నేతల వీడియోలు మాత్రమే బయటకు రాగా ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. అయితే ఈయన కూడా వైసీపీ స్కూల్ నుంచే టిడిపి చేరడం కొసమెరుపు. వైసీపీ నుంచి ఎన్నికల ముందు టీడీపీలో చేరి సత్యవేడు సీటు తెచ్చుకుని విజయం సాధించిన కోనేటి ఆదిమూలంపై ఒక మహిళ బహిరంగంగా లైంగిక ఆరోపణలు చేసింది.

ఒకే పార్టీకి చెందిన వాళ్ళం కావడంతో పలు మార్లు కార్యక్రమాల్లో తాము కలిసామని చెప్పిన ఆమె తీవ్ర విమర్శలు చేసింది. అలా పరిచయమై తర్వాత తన ఫోన్ నెంబర్ తీసుకున్నాడు అంటూ తనకు చేసిన కాల్స్ ని ఆమె చూపించింది. తిరుపతిలోని ఒక ప్రముఖ హోటల్ లో నుంచి రూమ్ నెంబర్ 109 లోకి రావాలని చెప్పాడని, అక్కడ తనను బెదిరించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇక్కడ కీలక విషయం ఏంటంటే.. ఇలా ఒక్కసారి కాకుండా ఆయన పిలిచినప్పుడల్లా ఆమె ఒంటరిగా హోటల్ కి వెళ్లడం. మరి సదరు మహిళ అంత అమాయకురాలా అన్న విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

ఇక ఎమ్మెల్యే పై ఆరోపణలు వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయనను సస్పెండ్ చేసింది. తదుపరి విచారణ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ స్థానికులు మాత్రం ఈ కథనం పై మరోరకంగా స్పందిస్తున్నారు. సదరు మహిళ… ఎమ్మెల్యేకి చెందిన నియోజకవర్గంలో ఇసుక క్వారీలను అడిగిందని… దీనికి ఎమ్మెల్యే నిరాకరించడంతోనే ఎప్పుడో తమ మధ్య జరిగిన విషయాలను బయటపెట్టిందని స్థానికులు అంటున్నారు. ఆర్ధిక విషయాల్లో ఎమ్మెల్యే సహకరించకపోవడంతోనే భర్త సహకారంతో ఆమె బ్లాక్ మెయిల్ కి దిగిందని, ఎమ్మెల్యే లొంగకపోవడంతోనే ఆమె మీడియా ముందుకు వచ్చి ఉండవచ్చు అని అంటున్నారు.

Read Also : బెజవాడ వరదలు… ఆ ముగ్గురే హీరోలు

ఇక్కడ షాక్ అయ్యే విషయం ఏంటీ అంటే… ఆ వీడియో షూట్ చేసింది 2023 లో.. అప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం… జగన్ కేబినేట్ లో మంత్రిగా ఉన్నాడు. పెన్ కెమెరాతో షూట్ చేసిన వీడియో అది. అతనితో గొడవలు జరిగి ఆమె 2024 జనవరిలో తెలుగుదేశం పార్టీలో జాయి అయింది. అలాగే ఈ వ్యవహారం వెనుక కొందరు వైసీపీ నేతల హస్తం కూడా ఉందనే వార్తలు వస్తున్నాయి. వరదల విషయంలో ప్రభుత్వ పనితీరుపై ప్రసంశలు రావడంతోనే మీడియాను డైవర్ట్ చేసేందుకు ఈ విషయాన్ని ఇప్పుడు బయటపెట్టి ఉండవచ్చు అంటున్నాయి రాజకీయ వర్గాలు. మరి అసలు నిజం అధికారుల విచారణలో నిగ్గుతేలాల్సి ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మళ్లీ కొత్త పాట...

ఏరు దాటే వరకు ఏటి మల్లన్న.....

ఏపీలో మద్యం ధరలు...

ఆంధ్రప్రదేశ్‌లో నూతన రిటైల్ ఎక్సైజ్ విధానం...

ఎన్టీఆర్ అభిమాని కొడుక్కి...

తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ భక్తి...

బ్రేకింగ్ : అమరావతిపై...

రాజధాని అమరావతి అసైన్డ్ భూముల ల్యాండ్...

గ్లోబల్ స్టేజీపై అమరావతి...

భారతదేశ అర్బన్ ప్లానింగ్ చరిత్రలోనే అత్యంత...

అమరావతి అసెంబ్లీలో స్వాతంత్ర్య...

భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రజలందరినీ...

పోల్స్