Saturday, September 19, 2026 09:52 AM
Saturday, September 19, 2026 09:52 AM

పవన్ ఫ్యాన్స్ కు మరో క్రేజీ న్యూస్

జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాలపై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు సినిమాల్లో నటిస్తుండగా ఒక సినిమా జూన్లో రిలీజ్ కానుంది. ఎప్పటినుంచో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ గురించి సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ చర్చించుకుంటూనే ఉన్నారు. అటు టాలీవుడ్ లో సైతం దీని గురించి ఆసక్తికర చర్చలే జరుగుతున్నాయి. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగును కంప్లీట్ చేశారు.

Also Read : టిబెటన్ పీఠభూమిపై విమానాలు ఎందుకు ఎగరలేవు?

అనారోగ్య కారణాలతో కొన్ని రోజులు పాటు సినిమా షూటింగ్ కు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేయడంతో సినిమా యూనిట్ ఎడిటింగ్ పనులపై పడింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేస్తుంది సినిమా యూనిట్. ఇదిలా ఉంచితే మరో రెండు సినిమాలు కూడా పవన్ కళ్యాణ్ లైన్లో పెట్టారు. సుజిత్ డైరెక్షన్లో ఒక సినిమా హరీష్ శంకర్ డైరెక్షన్లో మరో సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనున్నాయి. ఈ సినిమాల షూటింగు కూడా త్వరగా కంప్లీట్ చేయాలని పవన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాల తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని కూడా పవన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Also Read : కేసీఆర్ చేస్తే రైట్.. మరి రేవంత్ చేస్తే..!

పలు రాష్ట్రాల ఎన్నికలు ఉండటం ముఖ్యంగా తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికలపై దృష్టి పెట్టాల్సి ఉంది. అలాగే తెలంగాణలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు. దానికి తోడు బిజెపి అధినాయకత్వం కూడా పవన్ కళ్యాణ్ పై చాలా ఆశలు పెట్టుకుంది. వీటిని దృష్టిలో పెట్టుకున్న పవన్.. ఇప్పటివరకు సైన్ చేసిన సినిమాలు ఆలస్యమైతే నిర్మాతలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి వాటిని వేగంగా కంప్లీట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారట.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

పోల్స్