Wednesday, August 5, 2026 06:54 AM
Wednesday, August 5, 2026 06:54 AM

బోరుగడ్డ కేసులో కీలక పరిణామం

గతంలో అనుచిత వ్యాఖ్యలు చేయడం సహా పలు కేసుల్లో అరెస్ట్ అయిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌ ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. మధ్యంతర బెయిల్ తో బయటకు వెళ్లి వచ్చిన అనీల్.. జైలులో లొంగిపోయాడు. మధ్యంతర బెయిల్ వ్యవహారం సంచలనంగా మారింది. అతను తప్పుడు డాక్టర్ సర్టిఫికేట్ సమర్పించి కోర్ట్ ను సైతం మోసం చేసాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో అతనిపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

Also Read : జగన్‌ను అనుకరిస్తున్న కేటీఆర్..!

అనుబంధ పిటిషన్‌పై సోమవారం కోర్టులో విచారణ జరగగా… కోర్టు నిర్దేశించిన సమయంలోపు జైలు అధికారుల ముందు ఎందుకు హాజరుకాలేదో వివరణ ఇవ్వాలని బోరుగడ్డను హైకోర్టు ఆదేశించింది. తప్పుడు ధృవపత్రం సమర్పించి మధ్యంతర బెయిల్ పొందిన వైనంపై విచారణ నివేదికలను సీల్డ్ కవర్లో కోర్టు ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఏపీ హైకోర్టు వారం రోజుల పాటు కోర్ట్ వాయిదా వేసింది. తన తల్లికి హార్ట్ సర్జరీ చేయించాల్సి ఉందని ఓ లేఖను సృష్టించాడు అనీల్.

Also Read : విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకి రంగం సిద్దం..!

గుండె సంబంధిత ఇబ్బందితో తల్లి ఇబ్బంది పడుతోందని.. చెన్నై ఆస్పత్రిలో ఉన్నారని కాబట్టి తనకు బెయిల్ ఇవ్వాలంటూ గతంలో హైకోర్టులో బోరుగడ్డ పిటిషన్ వేసాడు. ఈ పిటిషన్‌ దాఖలు చేసిన సమయంలో గుంటూరుకు చెందిన ఓ డాక్టర్ ఇచ్చిన రిపోర్టును కోర్టుకు సమర్పించాడు. ఆ రిపోర్ట్ పై అనుమానాలు రావడంతో పోలీసులు విచారణ చేసి.. అతని తప్పుడు డాక్యుమెంట్ అని గుర్తించారు. అతను జైలు నుంచి విడుదలైన విషయం కూడా ఎవరికి తెలియకపోవడం ఆశ్చర్యం కలిగించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్