Monday, October 27, 2025 11:58 PM
Monday, October 27, 2025 11:58 PM
roots

మీరు ఇండియన్ అయితే.. రాహుల్ కు సుప్రీం కోర్ట్ షాక్

ఈశాన్య భారత్ తో పాటుగా సుదీర్ఘంగా ఉన్న సరిహద్దుల్లో చైనా భారత్ ను ఆక్రమించింది అనే ఆరోపణలు మనం వింటూనే ఉన్నాం. ఈ విషయంలో బిజెపి – కాంగ్రెస్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ వ్యాఖ్యల వ్యవహారం సుప్రీం కోర్ట్ కు చేరింది. ‘ భారత్ జోడో యాత్ర ‘ సందర్భంగా రాహుల్ గాంధీ.. అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా దళాలు భారత సైనికులను కొడుతున్నాయి అంటూ ఆరోపించారు. దీనిపై పరువు నష్టం కేసు దాఖలు కాగా.. సుప్రీం కోర్ట్ రాహుల్ గాంధీని తీవ్రంగా మందలించింది.

Also Read : రిజిస్టర్డ్ పోస్ట్ కు గుడ్ బై.. తపాలా శాఖ కీలక నిర్ణయం..!

2022 డిసెంబర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో జరిగిన భారత్-చైనా ఘర్షణను ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్య చేశారు రాహుల్. ఈ వ్యాఖ్యలపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎ.జి. మసీహ్‌లతో కూడిన ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 2,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని ఆయన మండిపడ్డారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన కోర్ట్.. 2,000 చదరపు కిలోమీటర్ల భూమిని చైనీయులు ఆక్రమించుకున్నారని మీకు ఎలా తెలిసింది? అని ప్రశ్నించింది.

Also Read : మెగా ఫ్యామిలీకి గడ్డు కాలమే..?

మీరు భారత పౌరుడు అయితే ఇటువంటి వ్యాఖ్యలు చేయరని ఘాటుగా వ్యాఖ్యానించింది. మీరు అక్కడ ఉన్నారా? మీ దగ్గర ఏదైనా విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించింది. రాహుల్ గాంధీ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ, ఆయన ఈ విషయాలు చెప్పలేకపోతే… ఆయన ప్రతిపక్ష నాయకుడు ఎలా అవుతారు? అని తన వాదనలు వినిపించారు. స్పందించిన ధర్మాసనం.. మరి పార్లమెంట్ లో అటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాహుల్ కు నోటీసులు జారీ చేసింది కోర్ట్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్