టాలీవుడ్ స్టార్ కపుల్ రష్మిక మందన్న – విజయ్ దేవరకొండల వివాహం కొడవ సాంప్రదాయంలో జరుగుతోందనే వార్తల నేపధ్యంలో అసలు ఆ పెళ్లి ఎలా జరుగుతుందనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొడవ (కూర్గ్) సాంప్రదాయ పెళ్లిళ్లలో పూర్వీకుల ఆశీర్వాదాలు, ప్రకృతి పూజలపైనే ఎక్కువగా డిపెండ్ అయి ఉంటాయి. పూజారులు లేకుండా, కుటుంబ పెద్దలు ఇక్కడ కీలకంగా వ్యవహరిస్తారు. మూడు ముళ్ళు, ఏడు అడుగులు ఉండవు. అలాగే వధువు ఒడిలో బియ్యం స్థానంలో నాణేల మూట ఉంటుంది.
Also Read : పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ రెడీ చేస్తున్న డైరెక్టర్లు..!
దీనిని సంపద, శుభానికి చిహ్నంగా అక్కడి ప్రజలు భావిస్తారు. వధువు తల్లి పాత్ర పెళ్లిలో కీలకం. పెళ్లి కూతురు వారి సాంప్రదాయంలో తయారు చేసిన చీర, శాలువాను ధరిస్తుంది. పెళ్లి కొడుకు సాంప్రదాయ వస్త్రాలు ధరిస్తాడట. పెళ్లి మండపాన్ని వెదురు, మామిడి ఆకులతో అలంకరిస్తారు. దానికి పెద్దలు పూజలు చేసే విధానాన్ని అరువు అని పిలుస్తారు. భోజనంలో కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. బొప్పాయి ఆకులపై భోజనం చేస్తారు. భోజనంలో పంది మాంసంకు ప్రాధాన్యత ఉంటుంది. అన్నం, చికెన్, పాయసం ముఖ్యం.
Also Read : రష్మిక – విజయ్ పెళ్ళికి వెళ్ళిన టాలీవుడ్ స్టార్లు వీళ్ళే..!
అలాగే ఊరు కొడవు అనే సాంప్రదాయం ఉంటుంది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఊరు వెళ్లి, అక్కడ పెద్దల సమ్మతితో వివాహం చేస్తారు. వధువు తలపై నీళ్ళు పెట్టి, పూర్వీకుల ముందు మూడు మంటల మధ్య కూర్చుని సప్తపది చేస్తారు. దీనిని “సమ్మంద కొడుప” అని పిలుస్తారు. వధువు హక్కులను, వరుడు కుటుంబానికి ఇవ్వడానికి ఈ పద్ధతి ఫాలో అవుతారు. కొడవ సంప్రదాయ పెళ్లిలో కావేరి నదిని కులదేవతగా భావిస్తారు. కావేరి నది నీళ్ళు లేకుండా వివాహం జరగదు.

