Wednesday, August 5, 2026 11:55 AM
Wednesday, August 5, 2026 11:55 AM

బ్రేకింగ్: విమాన ప్రమాదంలో డిప్యూటి సిఎం మృతి..!

రాజకీయ నాయకులను విమాన ప్రమాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సిఎం అజిత్ పవార్ ప్రయాణం చేస్తున్న చార్టెడ్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు అంటూ డీజీసిఏ అధికారులు వెల్లడించారు. బారామతి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ విమానంలో అజిత్ పవార్ తో సహా ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది.

Also Read : వైసీపీపై ప్రజాగ్రహం.. లేదంటే బహిష్కరణే..!

ముంబై నుండి విమానం బయలుదేరిన గంట తర్వాత ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ర్యాలీలలో ప్రసంగించడానికి ఎన్‌సిపి చీఫ్ బారామతికి వెళ్లాల్సి ఉంది. బారామతి విమానాశ్రయం సమీపంలో ఈ విమానం కుప్ప కూలినట్లుగా తెలుస్తోంది. అజిత్ పవార్ తో పాటుగా మరణించిన వారు ఎవరూ అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ప్రమాదానికి గల కారణాలు ఏంటీ అనే దానిపై మాత్రం అధికారులు విచారణ వేగవంతం చేసారు.

Also Read : పాక్ డ్రామాలకు ఐసీసీ చెక్.. ఓవర్ చేస్తే రిజల్ట్ అదే..!

ప్రమాదానికి ముందు ఏం జరిగింది అనే దానిపై బ్లాక్ బాక్స్ విచారణ ఆధారంగా బయటకు వచ్చే సూచనలు కనపడుతున్నాయి. దీని వెనుక ఏమైనా కుట్ర కోణం ఉందా అనే దానిపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. విమానం కూలిన వెంటనే మంటలు చెలరేగడంతో తప్పించుకునే అవకాశం లేకపోయిందని సమాచారం. శరద్ పవార్ రాజకీయ వారసుడిగా చెప్తున్న అజిత్ పవార్.. 2019 తర్వాత కీలక పరిణామాలతో ఎన్సిఏ శాసన సభా పక్షాన్ని వేరు చేసి.. పార్టీకి అధ్యక్షుడు అయ్యారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

పోల్స్