Thursday, March 12, 2026 09:11 PM
Thursday, March 12, 2026 09:11 PM

అమరావతి పై మళ్లీ మళ్ళీ అవే కుట్రలు

అమరావతి నిర్మాణం మళ్లీ ఊపందుకోవడంతో జీర్ణించుకోలేని శక్తులు కుట్రలకు తెరలేపాయి. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అమరావతి పనులు శరవేగంగా సాగుతుండటాన్ని తట్టుకోలేక, కొందరు దుండగులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. గతంలో భూసమీకరణ సమయంలో చెరకు తోటలకు నిప్పు పెట్టి రైతులను భయాందోళనలకు గురిచేసిన తరహాలోనే, ఇప్పుడు నిర్మాణ సామాగ్రిని ధ్వంసం చేస్తూ నీచమైన రాజకీయానికి ఒడిగడుతున్నారు.

Also Read : రేవంత్ కాదు.. అమిత్ షానే..? ఢిల్లీలో మావో అగ్రనేత..!

రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనుల కోసం ఎల్ అండ్ టీ సంస్థ తెచ్చిన భారీ పైపులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే, ఈ అగ్నిప్రమాదం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలిపోయిన పైపులు సాధారణంగా నిప్పు అంటుకునే రకానికి చెందినవి కావు. హై డెన్సిటీ మెటిరీయల్‌తో తయారు చేసినవి. అలాంటి పైపులు అగ్నికి ఆహుతి కావాలంటే పెట్రోల్ పోసి నిప్పు పెడితే తప్ప సాధ్యం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పైపులను భద్రపరిచిన ఆ బహిరంగ ప్రదేశంలో వంటలు చేయడం కానీ, నిప్పు పుట్టే ఇతర పనులు కానీ జరగడం లేదు. అయినప్పటికీ భారీగా మంటలు వ్యాపించాయంటే అది ముమ్మాటికీ దుండగుల పనే అని స్పష్టమవుతోంది. అమరావతిని నిర్వీర్యం చేయాలనే పాత కుట్రలే మళ్లీ బయటపడుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు, ఇన్వెస్టర్లను భయపెట్టేందుకు కొన్ని రాజకీయ శక్తులు ఏ రకమైన కుయుక్తులు పన్నాయో అందరికీ తెలిసిందే.

Also Read : మళ్లీ స్పెషల్ ఆఫీసర్ల పెత్తనం.. ఇలా అయితే..!

ఈ విధ్వంసకర చర్యలపై కూటమి ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు, ఇది ప్రమాదం కాదని..పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన కుట్ర అని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించిన ప్రభుత్వం, దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాజధాని ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని, ప్రధాన ప్రాంతాల్లో CCTV నిఘాను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏఐఎస్ అంటే ఏంటీ..?...

ఇరాన్ – ఇజ్రాయిల్ దేశాల మధ్య...

ముహుర్తం ఖరారు.. మార్చి...

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం రూపురేఖలు మారబోతున్నాయి....

ఏపీ మంత్రుల ప్రోగ్రెస్...

ఆంధ్రప్రదేశ్ లో మంత్రుల పని తీరును...

బ్రేకింగ్: భారత నౌకలకు...

ఇజ్రాయిల్ – ఇరాన్ దేశాల మధ్య...

లోకేష్ సీఎం.. ముహూర్తం...

​బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్...

బ్రేకింగ్: పాదయాత్రకు సిద్దమవుతోన్న...

తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని తిరిగి...

పోల్స్