Saturday, March 28, 2026 02:03 PM
Saturday, March 28, 2026 02:03 PM

వారికి దూరంగా ఉండండి.. జగన్ ఆదేశం..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో పేర్లున్న నాయకులు, అధికారుల నుంచి దూరం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న వారిలో చాలామంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా పలుకుబడి కలిగి ఉన్నారు. అలాగే జగన్ సన్నిహిత వర్గం అనే ముద్ర కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే.. వైసీపీ ప్రభుత్వంలో, పార్టీలో కూడా వాళ్లు ఏం చెబితే అదే ఫైనల్.. వాళ్లు చెప్పిందే వేదం అన్నట్లుగా పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు అలాంటి వారినే జగన్ దూరం పెట్టడం అందరనీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వారి సాన్నిహిత్యం కొనసాగడం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అవకాశాలను దెబ్బతీస్తుందని జగన్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

Also Read : ఏపీ లిక్కర్ కేసు.. తెలంగాణాలో భారీ ఆస్తులు..!

మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి. ఈయన వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐటీ సలహాదారుగా పనిచేశారు. పరిపాలనలో ప్రభావవంతమైన వ్యక్తిగా పరిగణించబడ్డారు. ఇక మరో కీలక నిందితుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ్ రెడ్డి. ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేశారు. జగన్ అత్యంత విశ్వసనీయ అధికారుల్లో ఒకరిగా ధనుంజయ్ రెడ్డికి పేరు. వైసీపీ ప్రభుత్వ హయాంలో, ఈయనను మాజీ ముఖ్యమంత్రికి ‘కళ్ళు, చెవులు’గా అభివర్ణించేవారు. అటు ప్రభుత్వంలో ఇటు పార్టీ పైన.. రెండింటిపైనా గణనీయమైన ప్రభావాన్ని చూపారు ధనుంజయ్ రెడ్డి. అభ్యర్థుల ఎంపికలో కూడా ఈయన కీలక పాత్ర పోషించారని వైసీపీ నేతలే ఆరోపించారు.

ఈ కేసులో మరో నిందితుడైన పి.కృష్ణ మోహన్ రెడ్డి. జగన్‌కు ప్రత్యేక అధికారిగా పనిచేశారు. గత ప్రభుత్వ హయాంలో కీలక నిర్ణయాధికార వర్గంలో ఒకరిగా పరిగణించబడ్డారు. మద్యం విధానానికి సంబంధించిన వాటితో సహా పలు కీలక విధానపరమైన అంశాలలో కృష్ణ మోహన్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరితో పాటు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వంటి సీనియర్ వైసీపీ నాయకుల పేర్లు కూడా ఈ కేసులో ఉన్నాయి. ప్రస్తుతం పార్టీలో చురుగ్గా లేనప్పటికీ, వైసీపీ మాజీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా మద్యం కుంభకోణం నిందితుల్లో ఉన్నారు.

Also Read : బస్సు ప్రమాదం.. వైద్య ఆరోగ్య శాఖపై విమర్శలు..!

పార్టీ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, మిథున్ రెడ్డి మినహా ఈ నాయకులు, మాజీ అధికారులు చాలా మంది ఇప్పుడు జగన్ కీలక రాజకీయ బృందంలో ఎటువంటి ప్రముఖ పాత్ర పోషించడం లేదు. మిథున్ రెడ్డిని ఇప్పటికీ ఆయనకు సన్నిహితుడిగానే పరిగణిస్తున్నారు. అయినప్పటికీ, ఆయన కూడా విస్తృతమైన సంస్థాగత పాత్రను చేపట్టకుండా, తన సొంత రాజకీయ కార్యక్రమాలకే పరిమితం అవుతున్నారని చెబుతున్నారు. పార్టీ నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కార్యక్రమాల్లో మిథున్ రెడ్డిని దూరం పెడుతున్నారనే మాట బాగా వినిపిస్తోంది.

మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి, కనీసం వారికి న్యాయపరమైన ఉపశమనం లభించే వరకు, పార్టీ ప్రధాన కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని జగన్ ఉద్దేశపూర్వకంగానే నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కొద్ది రోజులు దూరంగా ఉండాలని పార్టీ నేతలకు కూడా జగన్ సూచించినట్లు సమాచారం. “ఈ దశలో వారితో బహిరంగంగా ఎలాంటి సంబంధం పెట్టుకున్నా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులను జగన్ కాపాడుతున్నారని ఆరోపించడానికి అధికార కూటమికి అవకాశం లభిస్తుంది. రాబోయే ఎన్నికల ముందు ఇది పార్టీకి రాజకీయంగా భారంగా మారవచ్చు,” అని తన సన్నిహితులతో జగన్ స్వయంగా చెప్పినట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

భారతీ సిమెంట్స్ కు...

గత మూడు నాలుగు నెలలుగా ఉత్కంట...

బ్రేకింగ్: లోకేష్ సంచలన...

రాష్ట్రంలోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల ఇష్టారాజ్యానికి...

ఏపీ లిక్కర్ కేసు.....

ఏపీ మద్యం కుంభకోణం కేసులో విచారణ...

తిరుమలను తాకిన గ్యాస్...

పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్...

డిప్యూటీ స్పీకర్ రఘురామపై...

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఉద్రిక్తత...

బ్రేకింగ్: బయటపడ్డ అగ్ని...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గత కొద్దిరోజులుగా...

పోల్స్