Wednesday, August 5, 2026 07:52 AM
Wednesday, August 5, 2026 07:52 AM

ఏపీలో ఆమ్రపాలి కి సంచలన బాధ్యతలు..?

ఏపీ వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్న ఐఏఎస్ అధికారులకు తెలంగాణా హైకోర్ట్ బిగ్ షాక్ ఇచ్చింది. వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలసిందే అని హైకోర్ట్ స్పష్టం చేసింది. తమను తెలంగాణాలోనే విధులు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్ట్ లో ఐఏఎస్ అధికారులు పిటీషన్ దాఖలు చేయగా… కోర్ట్ డిస్మిస్ చేసింది. 15 రోజుల పాటు నిర్ణయాన్ని వాయిదా వేయాలని కోరినా కోర్ట్ నిరాకరించింది. ముందు ఏపీలో రిపోర్ట్ చేస్తే తర్వాత మీ సమస్యలు వింటాం అని క్లారిటీ ఇచ్చింది. నేడు సాయంత్రం అధికారులు ఏపీలో రిపోర్ట్ చేయాల్సి ఉంది.

ఇలాంటి వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకుంటే సమస్య మరింత తీవ్రంగా మారుతుందని, పరిస్థితిని అర్ధం చేసుకుని ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఆదేశాలను సమర్ధించింది కోర్ట్. దీనితో ఆమ్రపాలి సహా నలుగురు అధికారులు ఏపీలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. ఇక హరి కిరణ్, సృజన, శివశంకర్ తెలంగాణాలో రిపోర్ట్ చేయాలి. ఇక అధికారులకు 15 రోజులు గడువు ఇవ్వాలని తెలంగాణా, ఏపీ ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి. ఈ విషయాన్ని పిటీషనర్ల తరుపు న్యాయవాదులు కోర్ట్ దృష్టికి తీసుకు వెళ్ళినా కోర్ట్ వినలేదు.

Also Read : గ్రేటర్ హైదరాబాద్ కమీషనర్ ఎవరు…??

ఇలాంటి విషయాల్లో తాము జోక్యం చేసుకుంటే ఇది నెవెర్ ఎండింగ్ స్టోరీ అని తీర్పు సందర్భంగా కోర్ట్ ఐఏఎస్ అధికారులకు స్పష్టత ఇచ్చింది. దీనితో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఆసక్తిగా మారింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలంగాణాలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా అమ్రాపాలిని నియమించే అవకాశం ఉంది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమీషనర్ గా… దాసరి హరిచందన ను నియమించే అవకాశం కనపడుతోంది. అమ్రాపాలిని సిఆర్డియే కమీషనర్ గా నియమించే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్