Wednesday, February 4, 2026 07:43 PM
Wednesday, February 4, 2026 07:43 PM

చంద్రబాబు “మైక్రోసాఫ్ట్” స్ట్రాటజీ వర్కౌట్ అయిందా..?

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల విషయంలో చంద్రబాబు సర్కారు అనుకున్నది సాధిస్తుందా..? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. 2024 లో ఏపీలో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడుల విషయంలో ఇబ్బందులు పడింది. గత ఐదేళ్లపాటు జరిగిన విధ్వంసం తర్వాత చాలామంది పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాలేదు. చంద్రబాబు పై నమ్మకం ఉన్న సరే మళ్లీ జగన్ వస్తే తమకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అనే భావనలో చాలామంది వెనకడుగు వేశారు. చంద్రబాబు విదేశాల నుంచి పెట్టుబడి తీసుకొచ్చేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేసినా పెద్దగా సక్సెస్ అవ్వలేదని చెప్పాలి.

Also Read : రేవంత్ ను ముంచేస్తున్న ఎమ్మెల్యేలు

అయితే ఇప్పుడు మాత్రం కంపెనీలు పెద్ద ఎత్తున ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ సిద్ధంగా ఉన్నట్లు బిల్ గేట్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఒప్పందం కూడా జరిగింది. ఆ తర్వాత నుంచి ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు పలు కీలక సంస్థలు ఆసక్తి చూపించడం మొదలుపెట్టేసాయి. మైక్రోసాఫ్ట్ వస్తే చిన్న కంపెనీలు పెద్ద కంపెనీలు క్యూ కడతాయని చంద్రబాబు భావించారు. అందుకే తనకున్న స్నేహాన్ని వాడుకుని మైక్రోసాఫ్ట్ ను రాష్ట్రం లోకి తెచ్చే ప్లాన్ చేశారు.

Also Read : బ్యాంక్ ఖాతాలపై సంచలన నిర్ణయం

చివరకు ఈ ప్లాన్ వర్కౌట్ అయింది. ఇప్పుడు ఏపీలో google తో పాటుగా పలు కీలక సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రకటించారు. త్వరలోనే గూగుల్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తుందన్నారు. ఇక google తో పాటుగా పలు కీలక ఆటోమొబైల్ సంస్థలు అలాగే సెల్ఫోన్ తయారీ కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి.. ఆసక్తి చూపిస్తున్నాయి. దావోస్ పర్యటన ఫెయిల్ అయింది.. అనేది చాలామందిలో ఉన్న అభిప్రాయం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పలు కంపెనీల అధినేతలు.. వస్తారని అధికారుల సిద్ధంగా ఉండాలని చెప్పినా కొంతమంది సెటైర్లు వేశారు. ఇప్పుడు ఏపీలో గూగుల్ అడుగు పెడితే మాత్రం ఖచ్చితంగా అది సరికొత్త చరిత్ర.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్