Saturday, March 28, 2026 06:42 PM
Saturday, March 28, 2026 06:42 PM

శాసససభలో సరే.. మండలిలో చర్చ ఏమైంది..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధమైన హోదా కల్పిస్తూ ఏపీ శాసనసభ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది. అయితే అమరావతికి చట్టబద్ధమైన హోదా కల్పించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ ప్రతిపాదనను శాసనమండలిలో కూడా ఎందుకు ప్రవేశపెట్టడం లేదనేది ఆ పార్టీ నేతలు వేస్తున్న ప్రశ్న. ప్రజల దృష్టిని మళ్లించడానికి, అమరావతి రైతులను తప్పుదోవ పట్టించడానికి, రెండవ దశ కోసం వారి భూములను స్వాధీనం చేసుకునే ఉద్దేశ్యంతో చేస్తున్న ఒక ‘పెద్ద నాటకం’ అంటూ వైసీపీ నేతలు మరోసారి అమరావతిపై విష ప్రచారం చేస్తున్నారు.

అసెంబ్లీలో చర్చతో పాటు మండలిలో కూడా చర్చ పెట్టాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాజ్యసభలో వైసీపీకి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా, శాసనమండలిలో ఈ తీర్మానానికి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉన్నందున చంద్రబాబు ప్రభుత్వం మండలిని తప్పించుకుంటోందని కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ఇది ఒక తీర్మానానికి సంబంధించినదే తప్ప, సంప్రదాయ రాష్ట్ర బిల్లు కాదని, అందువల్ల ఈ తీర్మానానికి శాసనమండలి ఆమోదం అవసరం లేదని న్యాయ, రాజ్యాంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : మళ్ళీ దొరికిపోయిన ధనుష్, మృణాల్..?

నిజానికి వైసీపీ నేతలకు ఈ తరహా డిమాండ్ చేసే హక్కు లేదంటున్నారు టీడీపీ నేతలు. ఎందుకంటే.. గతంలో వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లును అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అదే సమయంలో మండలిలో చర్చ అవసరం లేదని కూడా ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. అదే సమయంలో మండలిని పూర్తిగా రద్దు చేయాలని కూడా అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభలోనే వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ వ్యత్యాసం ముఖ్యమైనది, ఎందుకంటే ప్రస్తుత చర్య గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల చట్టానికి ప్రాథమికంగా భిన్నమైనది.

వాస్తవానికి ప్రస్తుత సమావేశాల్లో చేసే తీర్మానం.. అమరావతికి చట్టబద్ధమైన మద్దతు లభించేలా సంబంధిత కేంద్ర చట్టాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని లాంఛనంగా అభ్యర్థించడమే ప్రస్తుత తీర్మానం ఉద్దేశ్యం. దీనివల్ల భవిష్యత్తులో ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా రాజధాని ఏర్పాటును మార్చడం కష్టతరం అవుతుంది. ప్రస్తుత న్యాయ వ్యూహంలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5కు సవరణ కోరడం ద్వారా ప్రభుత్వం ఒక బలమైన ‘చట్టపరమైన రక్షణ కవచం’ నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తోంది. తద్వారా భవిష్యత్తులో విధానపరమైన మార్పుల నుండి అమరావతిని కాపాడుకునేందుకు ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది.

Also Read : వారికి దూరంగా ఉండండి.. జగన్ ఆదేశం..!

సాధారణంగా, ద్విసభ శాసనసభలో, ఒక బిల్లు చట్టంగా మారాలంటే అది శాసనసభ, శాసనమండలి రెండింటి ఆమోదం పొందాలి. కానీ తీర్మానం భిన్నమైనది. ఇది ప్రాథమికంగా సభ అభిప్రాయం లేదా సంకల్పం. కేంద్రంలో పార్లమెంటరీ సవరణ ప్రక్రియను ప్రారంభించడమే దీని ప్రాథమిక ఉద్దేశ్యం కాబట్టి, ఈ దశలో కేవలం శాసనసభ ఆమోదం మాత్రమే సరిపోతుందని న్యాయ, రాజ్యాంగ నిపుణులు సూచిస్తున్నారు. “రాజ్యాంగ సవరణ బిల్లుకు ఇది అత్యవసరం కాబట్టి, ప్రధానమంత్రి కార్యాలయం సలహా మేరకు ఈ తీర్మానాన్ని ఆమోదిస్తున్నారు,” అని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

2020లో పరిస్థితి చాలా భిన్నంగా ఉండేది. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి బిల్లు’ అనే రాష్ట్ర బిల్లును ప్రవేశపెట్టింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 197 ప్రకారం, శాసన మండలి ఉన్న రాష్ట్రంలో ఒక సాధారణ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందాలి. ఆ సమయంలో, అధికార వైసీపీకి అసెంబ్లీలో మెజారిటీ ఉన్నప్పటికీ, శాసన మండలిలో దానికి తగినంత బలం లేదు. అనంతరం కౌన్సిల్ తన అధికారాలను ఉపయోగించి ఆ బిల్లును ఒక సెలెక్ట్ కమిటీకి పంపింది, తద్వారా దానిని సమర్థవంతంగా నిలిపివేసి, రాజ్యాంగపరమైన, రాజకీయ ప్రతిష్టంభనను సృష్టించింది. తరువాత ప్రభుత్వం 2021లో, సాంకేతిక కారణాలు, హైకోర్టులో విచారణలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంటూ ఆ బిల్లులను పూర్తిగా ఉపసంహరించుకుంది.

Also Read : ఇరాన్‌ కు ట్రంప్ భారీ ఊరట.. డెడ్ లైన్ పెంచిన అమెరికా..!

అయితే ప్రస్తుతం మండలిలో కూడా కూటమి ప్రభుత్వానికి తగినంత మద్దతు ఉంది. గతంలో వైసీపీకి ఉన్న పరిస్థితులు ప్రస్తుతం లేవు. సభతో పాటు మండలిలో కూడా బిల్లు ప్రవేశపెడితే.. ఆమోదం లభిస్తుంది. ఈ విషయం వైసీపీ నేతలకు కూడా తెలుసు. అయినా సరే.. వారు మండలిలో చర్చకు పట్టుబడుతున్నారు. ఇందుకు ప్రధానంగా అమరావతిలో అక్రమాలు జరుగుతున్నాయని.. అవినీతి చేస్తున్నారని.. గ్రాఫిక్స్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారనేది వైసీపీ నేతల ఆరోపణ. ఈ విషయాలను మండలిలో ప్రస్తావిస్తామనేది వైసీపీ నేతల మాట. అందుకే మండలిలో చర్చకు వైసీపీ నేతలు పట్టుబడుతున్నారు. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం మండలిలో చర్చ అవసరం లేదని.. శాసనసభలో తీర్మానం సరిపోతుందంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

చెల్లెలు కోసం అన్నకు...

తెలంగాణ రాజకీయాల్లో గత ఏడాది కాలంగా...

ద్వారంపూడికి చెక్..? ఫోకస్...

ఏపీలో కూటమి ప్రభుత్వం.. నామినేటెడ్ పదవుల...

వారికి దూరంగా ఉండండి.....

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్...

భారతీ సిమెంట్స్ కు...

గత మూడు నాలుగు నెలలుగా ఉత్కంట...

బ్రేకింగ్: లోకేష్ సంచలన...

రాష్ట్రంలోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల ఇష్టారాజ్యానికి...

ఏపీ లిక్కర్ కేసు.....

ఏపీ మద్యం కుంభకోణం కేసులో విచారణ...

పోల్స్