ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపేలా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులతో జరిగిన తాజా సమీక్షా సమావేశంలో ఆయన తన ప్రతిష్టాత్మక ‘పాదయాత్ర 2.O’ పై క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా తన సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభం కాబోతోందని జగన్ అధికారికంగా వెల్లడించారు.
Also Read : 20 కోట్లు ఆఫర్.. సెక్యూరిటీ కోసం చంద్రబాబుకు దస్తగిరి రిక్వెస్ట్.!
మొన్నటికి మొన్న వైఎస్సార్ జయంతి సెంటిమెంట్తో కూడిన ఊహాగానాలు నడిచినప్పటికీ, తాజా పర్చూరు నేతల భేటీతో యాత్ర ముహూర్తంపై ఆయన స్వయంగా ఒక స్పష్టమైన టైమ్లైన్ను క్యాడర్ ముందు ఉంచారు. ఈ పాదయాత్ర ద్వారా దాదాపు ఏడాదిన్నర పాటు నిరంతరాయంగా ప్రజల మధ్యే గడపాలని జగన్ గట్టి ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుత చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగనుంది.
Also Read : లండన్ టు బిగ్ బాస్ హౌస్..? యూట్యూబర్ నందు అరెస్ట్ డ్రామా..?
“ప్రభుత్వానికి ఇంకా కేవలం రెండు బడ్జెట్లు, మూడేళ్ల పాలన మాత్రమే మిగిలి ఉంది” అని గుర్తు చేస్తూ, ఇప్పటి నుంచే ప్రజల్లో ఉంటూ కూటమి వైఫల్యాలపై పోరాటాలు ఉధృతం చేయాలని పర్చూరు నేతలకు జగన్ పిలుపునిచ్చారు. ఎన్నికల ఓటమి తర్వాత వైఎస్సార్సీపీ శ్రేణులు నిరాశలో ఉన్నాయనే ప్రచారానికి భిన్నంగా, జగన్ వరుసగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుపుతూ నేతలను, కార్యకర్తలను గ్రౌండ్ లెవెల్లో ఫుల్ యాక్టివ్ చేస్తున్నారు. ప్రతి వారం ఒక నియోజకవర్గ ప్రతినిధులతో స్వయంగా తాడేపల్లిలో మమేకమవుతూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ సరికొత్త సుదీర్ఘ పాదయాత్ర 2.O ఏపీ రాజకీయాల్లో మైండ్ బ్లోయింగ్ టర్నింగ్ పాయింట్గా మారబోతోందని, 2029 ఎన్నికల సమరానికి ఇది వైసీపీకి బూస్టర్లా పనిచేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

