దేశంలో అత్యవసర వైద్య సేవలను మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన అడుగు వేసింది. ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో మరియు పెద్ద అంబులెన్స్ లు వెళ్లడానికి వీల్లేని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో తక్షణ వైద్య సాయం అందించడమే లక్ష్యంగా ద్విచక్ర వాహన అంబులెన్సుల ఏర్పాటుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం కేంద్ర మోటారు వాహన నిబంధనలు-1989కి సవరణలు చేస్తూ కీలక ప్రతిపాదనలు తీసుకువచ్చింది.
Also Read : మళ్లీ మొదలైన కావేరీ రచ్చ.. విజయ్ సంచలన నిర్ణయం..!
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు లేదా అత్యవసర వైద్యం అవసరమైనప్పుడు మొదటి కొన్ని నిమిషాలు చాలా విలువైనవి. ఆ సమయంలో పెద్ద అంబులె న్స్లు సన్నటి సందుల్లోకి లేదా కొండ ప్రాంతాల్లోని గ్రామాల్లోకి వెళ్లడం కష్టతరంగా మారుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా బైక్ అంబులెన్స్ లను ప్రవేశపెడుతున్నారు. వీటి ద్వారా పారామెడికల్ సిబ్బంది ప్రథమ చికిత్స కిట్లతో వేగంగా రోగి వద్దకు చేరుకుని ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. ఈ ద్విచక్ర వాహన అంబులెన్సుల నిర్వహణ, రిజిస్ట్రేషన్ మరియు ఫిట్నెస్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను రూపొందించింది.
Also Read : బ్రేకింగ్: విజయ్ పై కామెంట్స్.. స్టాలిన్ అరెస్ట్..!
సాధారణ బైక్లకు భిన్నంగా ఈ అంబులెన్స్ బైక్లలో రోగికి అవసరమైన ఆక్సిజన్ సిలిండర్, అత్యవసర మందులు, ఫస్ట్ ఎయిడ్ కిట్ మరియు సైరన్ వంటి ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి వీలుగా నిబంధనలను సవరించనున్నారు. ఈ కొత్త నిబంధనలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ముసాయిదా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీనిపై సాధారణ ప్రజలు, వాహన తయారీదారులు మరియు నిపుణులు తమ సలహాలు, సూచనలు లేదా అభ్యంతరాలను తెలియజేయడానికి ప్రభుత్వం 30 రోజుల సమయం ఇచ్చింది. ఈ గడువు ముగిసిన తర్వాత, వచ్చిన సూచనలన్నింటినీ పరిశీలించి కేంద్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ను జారీ చేయనుంది. 2027 అక్టోబర్ 1 నుండి కొత్తగా వచ్చే వాహనాలకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి.

