క్రికెట్ ప్రేమికులకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఒక ఊహించని మెగా సర్ప్రైజ్ ఇచ్చింది. ఆస్ట్రేలియాలో అత్యంత ప్రజాదరణ పొందిన బిగ్ బాష్ లీగ్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ఈ లీగ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియా వెలుపల ఒక మ్యాచ్ను నిర్వహించబోతున్నారు. అదీ ప్రపంచ క్రికెట్కు గుండెకాయ లాంటి భారతదేశంలో ఈ మ్యాచ్ జరగనుండటం విశేషం. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఐకానిక్ చేపాక్ స్టేడియం వేదికగా బిగ్ బాష్ లీగ్ ఓపెనింగ్ మ్యాచ్ను నిర్వహించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Also Read : 50 దాటిన మహిళలు ఈ విషయంలో జాగ్రత్త..!
ఈ ఏడాది డిసెంబర్ 12వ తేదీన ఈ చారిత్రాత్మక ప్రారంభ మ్యాచ్ జరగనుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఈ కీలకమైన క్రీడా అప్డేట్ను అధికారికంగా వెల్లడించారు. భారత్-ఆస్ట్రేలియా దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను, క్రీడా బంధాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ను భారత్కు తీసుకురావడం ద్వారా ఇరు దేశాల క్రికెట్ అభిమానులకు సరికొత్త అనుభూతిని అందించవచ్చని ఆస్ట్రేలియా క్రికెట్ ప్రతినిధులు భావిస్తున్నారు.
Also Read : మెగా 158 కోసం మెగాస్టార్ డెడికేషన్..!
సాధారణంగా ఐపీఎల్ తర్వాత ప్రపంచంలోనే అత్యధిక ఆదరణ ఉన్న లీగ్స్లో బిగ్ బాష్ లీగ్ ఒకటి. ఇప్పుడు ఈ టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్ చెన్నైలో జరగనుండటంతో భారతీయ క్రికెట్ అభిమానులు, ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఎంతో ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ నెలలో జరగబోయే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్కు సంబంధించిన జట్లు, ఆటగాళ్ల వివరాలను మరియు టికెట్ల అమ్మకాల షెడ్యూల్ను క్రికెట్ ఆస్ట్రేలియా త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.

