Wednesday, August 5, 2026 07:04 AM
Wednesday, August 5, 2026 07:04 AM

హిందూ మహాసముద్రంలోకి అడుగుపెట్టిన యుద్ధం..?

రోజుల తరబడి సాగుతున్న ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం ఇప్పుడు ఊహకు అందని తీర ప్రాంతాలకు మారుతోందా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. హిందూ మహాసముద్రంలోని అమెరికా-బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం డియాగో గార్సియాపై ఇరాన్ క్షిపణి దాడికి ప్రయత్నించడం యుద్ధం కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోందనే ఆందోళనలను రేకెత్తించింది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం ఇరాన్ రెండు మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను డియాగో గార్సియా లక్ష్యంగా ప్రయోగించింది.

Also Read : షిర్డీ సాయిని వెంటాడుతున్న ఏబీవీ.. కోర్ట్ సంచలన ఆదేశాలు..!

ఈ దాడుల వల్ల ఎటువంటి నష్టం వాటిల్లలేదని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఒక క్షిపణి గాలిలోనే విఫలం కాగా, రెండో దానిని అమెరికా యుద్ధనౌక ప్రయోగించిన ఎస్ఎం-3 ఇంటర్సెప్టర్ అడ్డుకుంది. డియాగో గార్సియా అనేది బ్రిటన్ ఆధీనంలోని ఛాగోస్ దీవుల్లో ఉన్న ఒక కీలక వ్యూహాత్మక స్థావరం, దీనిని అమెరికా తన బాంబర్లు, ఇతర సైనిక కార్యకలాపాల కోసం ఉపయోగిస్తుంది. ఇరాన్ భూభాగం నుండి ఈ సైనిక స్థావరం సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పటివరకు ఇరాన్ క్షిపణుల పరిధి 2,000 కి.మీ మాత్రమేనని భావించేవారు.

Also Read : గ్రాండ్ గా రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌..!

కానీ ఈ దాడితో ఇరాన్ సుదూర లక్ష్యాలను ఛేదించగల క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసుకుందని తేలిపోయింది. ఈ ఘటన పశ్చిమాసియా దాటి హిందూ మహాసముద్రం వరకు యుద్ధం విస్తరించిందని సంకేతాలిస్తోంది. గతంలో శ్రీలంక తీరానికి సమీపంలో ఇరాన్ యుద్ధనౌక ‘ఐరిస్ డేనా’ ను అమెరికా సబ్ మెరైన్ ముంచివేసిన నేపథ్యంలో ఈ దాడి చోటుచేసుకోవడం గమనార్హం. అమెరికా తన స్థావరాల నుండి దాడులు చేయడానికి అనుమతి ఇస్తున్నందుకు గాను, బ్రిటన్ పౌరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ గతంలోనే హెచ్చరించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్