Tuesday, October 21, 2025 11:25 PM
Tuesday, October 21, 2025 11:25 PM
roots

డీజిల్, పెట్రోల్ ను జీఎస్టీలో అందుకే చేర్చడం లేదా..?

దేశ వ్యాప్తంగా జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వచ్చాయి. దీనితో కొన్ని ధరలు తగ్గగా, మరికొన్ని ధరలు పెరిగాయి. ఈ నేపధ్యంలో పెట్రోల్ ఉత్పత్తుల విషయంలో ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. అసలు వాటిని జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకు రావడం లేదనే ప్రశ్నలు మనం వింటూనే ఉంటాం. అసలు దాని వెనుక ఉన్న కథ ఏంటో ఒకసారి చూద్దాం. మన దేశంలో పెట్రోల్, డీజిల్ పై భారీగా పన్ను విధిస్తూ ఉంటారు. ఇవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గణనీయమైన భారీ ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి.

Also read : లిక్కర్ కేసు సిబిఐకే..? చంద్రబాబు సంచలనం..!

వాటి ఉమ్మడి(కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల) పన్నులు 100 శాతం మించిపోవడంతో, రెండు ప్రభుత్వాలు పన్నులను తగ్గించడానికి వెనుకాడుతున్నాయి. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. తాము ఉద్దేశపూర్వకంగా జీఎస్టీ పరిధిలో పెట్రోల్, డీజిల్‌ ను చేర్చలేదని, చేర్చేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు తెలిపారు. కానీ ఈ నిర్ణయం రాష్ట్రాల నుండి రావాలన్నారు. ప్రస్తుతం, పెట్రోల్, డీజిల్ పై కేంద్రం ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాలు వ్యాట్ ద్వారా పన్ను విధిస్తున్నాయి. రెండు ప్రభుత్వాలు ఈ ఆదాయంపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి.

Also read : మర్రి రాకతో గుబులు మొదలైందా..?

ముఖ్యంగా రాష్ట్రాలు పన్నులు విధించే సామర్థ్యాన్ని పరిమితం చేయడం, కేంద్రంపై ఆధారపడటాన్ని పెంచే విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తాయి. ఇంధనాలను జీఎస్టీలో చేరిస్తే.. రాష్ట్రాలు తమ సొంత పన్ను విధానం, ధర నిర్ణయించడం, వినియోగ విధానాలను ప్రభావితం చేయడంపై నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాలు తమ పన్ను ఆదాయంలో 25-30% కంటే ఎక్కువ ఇంధనాలపై ఆధారపడతాయి. అందుకే జీఎస్టీలో ఇంధనాలు చేర్చే విషయంలో రాష్ట్రాలు ముందుకు రాలేని పరిస్థితి ఏర్పడింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఆ పదవులు ఎప్పుడు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే...

వాళ్ళను వదలొద్దు.. చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర...

ఉప్పు, పప్పు కూడా...

ఇద్దరు అధికారులు తన్నుకుంటే.. అది ఏమవుతుందో...

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

పోల్స్