Wednesday, August 5, 2026 11:14 AM
Wednesday, August 5, 2026 11:14 AM

భారత్ కు ట్రంప్.. అమెరికా రాయబారి కీలక ప్రకటన

నిత్యం వివాదాస్పద వైఖరితో ప్రపంచ దేశాలకు చుక్కలు చూపించే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. భారత్ విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. భారత్ అమెరికాకు ముందు నుంచి నమ్మకమైన స్నేహితుడిగా ఉన్నా సరే ట్రంప్ మాత్రం సుంకాలతో భారత్ ను ఇబ్బంది పెట్టారు. ఇక ప్రపంచ దేశాలకు సైతం భారత్ పై భారీగా సుంకాలు విధించాలి అంటూ సూచనలు చేయడం మొదలుపెట్టారు. రెండు దఫాలుగా భారత్ పై 50 శాతం సుంకాలు విధించడంతో.. భారత్ కూడా ప్రత్యామ్న్యాయాలు వెతకడం మొదలుపెట్టింది.

Also Read : వరల్డ్ వైడ్ గా మిరాయ్ డామినేషన్.. సెంచరీ మార్క్ పక్కా..!

ఇదిలా ఉంచితే ఇప్పుడు భారత్ తో మళ్ళీ స్నేహాన్ని పెంచుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. నవంబర్ లో భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉందని భారత్ లో అమెరికా రాయబారిగా నామినీగా ఉన్న సెర్గియో గోర్ వెల్లడించారు. వైట్ హౌస్ ఈ పర్యటనపై వర్క్ చేస్తోందని ఆయన కామెంట్ చేసారు. ట్రంప్ గనుక భారత్ వస్తే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ కు ఊతం లభిస్తుందని, ఫార్మా, రక్షణ రంగాలకు ఇది ఖచ్చితంగా లాభదాయకం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read : AI కంటెంట్ క్రియేటర్స్‌కి లైసెన్స్ తప్పనిసరి

ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా భారత్ కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికాకు భారత్ దూరం అయ్యే సంకేతాలు ఉండటంతో రష్యా జాగ్రత్త పడుతోంది. రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింతగా పెంచాలని భావిస్తోంది. ఇదిలా ఉంచితే.. విదేశీ ఉద్యోగుల విషయంలో ఇప్పటి వరకు మొండి వైఖరి ప్రదర్శించిన ట్రంప్.. తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేసారు. విదేశీ నిపుణులను నియమించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వారి నుంచి నేర్చుకుని వారికంటే మెరుగ్గా రాణించాలి అని కోరుకుంటున్నా అంటూ కామెంట్ చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్