Sunday, June 21, 2026 02:02 PM
Sunday, June 21, 2026 02:02 PM

మహిళ దెబ్బకు షాక్ అయిన సుప్రీం ఛీఫ్ జస్టిస్

ఈ మధ్యకాలంలో విడాకుల వ్యవహారాలు భర్తలకు సమస్యగా మారుతున్నాయి. డబ్బున్న వారి దగ్గర నుంచి పేదవారి వరకు ఈ వ్యవహారంలో నానా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురై అవి విడాకుల వరకు వెళుతుంటే ఆ తర్వాత న్యాయస్థానాల్లో ఎదురయ్యే సమస్యలు మగవారిని మరింత ఇబ్బంది పెడుతున్నాయి. భర్తకు భారీ ఆదాయం ఉందంటూ భార్యలు భరణం భారీగా డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. సాధారణంగా భరణం డిమాండ్ చేసే మహిళలు తమ పోషణ కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తుంటారు.

Also Read : ఇటలీలో రేసింగ్ ప్రమాదం.. మరోసారి సురక్షితంగా బయటపడ్డ హీరో అజిత్

కానీ ఇప్పుడు మహిళలు మాత్రం భరణం రూపంలో సంపాదన వెతుక్కుంటున్నారు. భరణం ద్వారా కోట్ల రూపాయలను సంపాదించాలనే లక్ష్యం పెట్టుకుని అడుగులు వేస్తున్నారు. తాజాగా ఓ మహిళ అడిగిన భరణం చూసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భూషణ్ గవాయి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విడాకులు పొందేందుకు ఓ మహిళ భరణం కింద 12 కోట్ల రూపాయలతో పాటుగా ముంబైలో ఒక ఇల్లు అలాగే బిఎండబ్ల్యూ కారు కూడా కోరింది. ఈ కేసును విచారించిన చీఫ్ జస్టిస్.. ఉన్నత చదువులు చదివి అలాగే సొంతగా సంపాదించుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో భరణం అడగడం సరికాదని సదరు మహిళకు సూచించారు.

Also Read : దుబాయ్ ను చూస్తే అసూయ.. చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్

దీనిపై స్పందించిన సదరు మహిళ తన భర్త ధనవంతుడని తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నానని కోర్టుకు తెలిపింది. అతనే తనకు విడాకులు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాడని కోర్టుకు వివరించింది. వైద్యం కోసం ఎక్కువ ఖర్చవుతుందని అంత భరణం అడుగుతున్నానని కోర్టుకు తెలుపగా.. దీనిపై స్పందించిన బీర్ గవాయి.. భరణం గా భర్త నుంచి ముంబైలో ఇల్లుతో పాటుగా నాలుగు కోట్ల నగదు ఇప్పిస్తామని అలాగే ఉద్యోగం చేసుకోవాలని సదరు మహిళలకు సూచించారు. ఈ ఆర్డర్ ను చీఫ్ జస్టిస్ రిజర్వ్ చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్