Wednesday, February 4, 2026 07:39 PM
Wednesday, February 4, 2026 07:39 PM

పంత్ కు ఏమైంది..? 27 కోట్ల ఒత్తిడిలో ఉన్నాడా..?

అంతర్జాతీయ క్రికెట్ లో రిషబ్ పంత్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రత్యర్ధి ఎవరైనా సరే తన దూకుడుతో చుక్కలు చూపిస్తూ ఉంటాడు పంత్. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మైదానాల్లో అతని దూకుడు చాలా సందర్భాల్లో భారత్ కు కలిసి వచ్చింది. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో పంత్ ఆట తీరు విమర్శకుల ప్రశంశలు అందుకుంది. దూకుడుగా ఆడటమే కాకుండా కీపింగ్ లో ప్రత్యర్ధులపై ఒత్తిడి పెంచుతూ ఉంటాడు. టెస్ట్ క్రికెట్ లో మరుపురాని విజయాలను కూడా అందించాడు ఈ యువ ఆటగాడు.

Also Read : బ్యాటింగ్ ఓకే.. బౌలింగ్ పైనే ప్రశ్నలన్నీ

అయితే ఈ ఏడాది ఐపిఎల్ సీజన్ విషయానికి వస్తే.. పంత్ ఆట తీరు దారుణంగా ఉంది. గత ఐపిఎల్ సీజన్లలో అదిరిపోయే ఆట తీరుతో దుమ్ము రేపిన పంత్.. ఈ ఏడాది సీజన్ లో మాత్రం అంచనాలను ఏ మాత్రం అందుకోలేదు. భారీ షాట్ లు ఆడే ఈ ఆటగాడు.. టెస్ట్ క్రికెట్ తరహాలో ఎక్కువగా డిఫెన్స్ కు ప్రాధాన్యత ఇవ్వడం, షాట్ లు ఆడే బంతులకు కూడా వికెట్ పారేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. సాధారణంగా ఒక ఆటగాడు ఫాం కోల్పోతే పెద్ద విషయం కాదు గాని.. ఈ ఏడాది పంత్ ను కొన్న ధరే అతని మీద ఒత్తిడి పెంచేసింది అని చెప్పాలి.

Also Read : ఇంగ్లీష్ టూర్‌కు ఆ ముగ్గురూ ఫిక్స్..?

పంత్ ను ఏకంగా 27 కోట్లు ఖర్చు చేసి లక్నో కొనుగోలు చేసింది. బహుసా ఈ ఒత్తిడిలో ఏమైనా పంత్ ఉన్నాడేమో గాని.. అతను మాత్రం ఒక్క మ్యాచ్ లో కూడా అతనికి తగ్గ ఆట తీరు ప్రదర్శించలేదు. కెఎల్ రాహుల్ ను వదులుకుని.. పంత్ కు భారీ ధర పెట్టిన లక్నో యాజమాన్యం, అతని ఆట తీరుతో షాక్ అవుతోంది. ఇక సోషల్ మీడియాలో అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే ఆడటం లేదా అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఈ సీజన్ లో పంత్ చేసింది కేవలం 128 పరుగులు మాత్రమే. కేవలం ఆరు సిక్సులు 11 ఫోర్లు మాత్రమే కొట్టాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్