Wednesday, February 4, 2026 09:24 PM
Wednesday, February 4, 2026 09:24 PM

దట్ ఈజ్ ఎన్టీఆర్..!

తెలుగు వాడి ఆత్మగౌరవానికి నిలువుటద్దం నందమూరి తారకరాముడు. జనానికి మాత్రమే తెలిసుంటే చాలదు. జనం గురించి తెలిసిన వాడే నిజమైన నాయకుడని నిరూపించిన మహామాన్వితుడు ఆయన. రాజకీయ వారసత్వం లేదు… రాజ్యాలేలిన చరిత్రా లేదు.. తనదైన పట్టుదల, క్రమశిక్షణలతో ఆయన వేసిన ఒక్క అడుగే ప్రభంజనమైంది. కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి, ఢిల్లీ పాలకులకు తెలుగోడి సత్తా తెలిసొచ్చేలా చేసింది.

Also Read : సల్మాన్ ను వెంటాడుతున్న లారెన్స్ గ్యాంగ్

ప్రజలు ఓట్లేసినంత మాత్రాన ప్రతి ఒక్కరూ నాయకుడైపోతారనుకుంటే.. అది పొరపాటే. అందుకే రాజకీయ చరిత్రలో కొందరే జననేతలుగా చిరస్ధాయిగా నిలిచిపోతుంటారు. ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంటారు. ప్రజాహిత పాలనకు నిలువుటద్దంగా గుర్తుండిపోతారు. అలా చిరస్మరనీయుడిగా తెలుగు జాతి జనుల గుండెల్లో కొలువుండిపోయిన… వ్యక్తి.. శక్తి… నందమూరి తారక రామారావు.

తెలుగు సినీ వినీలాకాశంలో ఎన్టీఆర్ ఓ సంచలనం… రాజకీయాల్లో ఆయనో ప్రభంజనం. ఆయన పేరు తెలుగువాడి ఆత్మగౌరవం.. ఆయన తీరు రాజకీయ విశ్వరూపం.. నటుడిగా ప్రజల గుండెల్లో కొలువైన దైవ రూపం.. నాయకుడిగా ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపం.. తెలుగు జాతి ఆత్మగౌరవం హస్తిన వీధుల్లో పరాభవానికి గురవుతుంటే ఈ మానధనుడి గుండె మండిపోయింది. ఢిల్లీ అహంకారంపై తిరుగుబావుటా ఎగరేసి.. తల ఎత్తి తెలుగోడి సత్తా చాటిన వ్యక్తి ఎన్టీఆర్. తనకున్న ప్రజాభిమానంతో రంగేసుకునే వాళ్లకు రాజకీయాలేంటని విమర్శించిన నోళ్లకు తాళాలు వేస్తూ తనదైనశైలిలో రాజసం ప్రదర్శించారు.

Also Read : అన్నల సారథి ఎవరు..? రేసులో ఆ ఇద్దరు..!

రైట్ పర్సన్ ఇన్ ద రైట్ టైం అన్నట్లు.. రాష్ట్రంలో రాజకీయ శూన్యతను పసిగట్టి తెలుగుదేశం పార్టీకి శ్రీకారం చుట్టి, తొమ్మిది నెలల్లోనే కాంగ్రెస్ కంచుకోటలు బద్దలు కొట్టారు. నిజానికి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగు పెట్టే సమయానికి తెలుగు సినీ జగత్తుకి ఆయనే సార్వభౌముడు. రాజకీయాల్లోకి రాకపోయినా.. ఆయనకు వచ్చే నష్టమేమీ లేదు. కానీ తనను దైవంలా ఆరాధించే తెలుగు ప్రజలకు కేంద్ర స్థాయిలో జరుగుతున్న అవమానాలు సహించలేక.. తన తెలుగు ప్రజల కోసం, తన తెలుగు జాతి కోసం పొలిటికల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చారు. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తే అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఎన్టీయార్ దూకుడుకి బెంబేలెత్తిన కేంద్ర కాంగ్రెస్.. రాజ్యసభ సీటుతో వల వేయడానికి ప్రయత్నించింది. కానీ తన జాతి కోసమే వచ్చాను తప్ప.. పదవుల కోసం కాదంటూ ఆయన నేరుగా ప్రజల్లోకే వెళ్లారు.

1982 మార్చి 29.. హైదరాబాద్‌లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ .. తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్టు ఓ చిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు అన్నగారు.. తమ అభిమాన నటుడు.. ఓట్ల కోసం తమ మధ్యకు వచ్చేసరికి తబ్బిబ్బైన జనం నీరాజనాలు పలికారు. నాటి నుంచి ఎన్టీఆర్ వేసిన ప్రతి అడుగు సంచలనమైంది. పలికిన ప్రతి పలుకూ ప్రభంజనమైంది. తెలుగు వారి ఆత్మగౌరవమే నినాదంగా చైతన్యరథంపై ఆయన చేసిన యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ టైంలో పార్టీ పెట్టడమే ఓ సాహసం అనుకుంటే, దశాబ్దాలుగా పాతుకుపోయిన కాంగ్రెస్‌ను మట్టికరిపించి, నెగ్గుకు రావడం నిజంగా విశేషమే.

Also Read : కోహ్లీ బాటలోనే రోహిత్.. సంతోషంలో ఫాన్స్..!

ఎన్టీఆర్ రాజకీయాల్లో అడుగు పెట్టగానే ఆయనకు రియల్ పాలిటిక్స్ రుచి చూపించారు కాంగ్రెస్ నేతలు. టీడీపీ ఆవిర్భావ సమయంలో ఎన్నో అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు. ఆయన సభలకు అనుమతులు ఇవ్వకపోవడం, సెక్యూరిటీ కేటాయించకపోవడం వంటి చీప్ ట్రిక్స్ ప్లే చేశారు. అయితే అన్నగారు తన చైతన్య రథాన్నే వేదికగా చేసుకుని జనంలోకి వెళ్లారు. ప్రజలే నా దేవుళ్లు… సమాజమే నా దేవాలయం అంటూ ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలు ప్రజల మననుల్లో బలంగా నాటుకు పోయాయి. కూడు, గూడు, గుడ్డ అంటూ వచ్చిన ఎన్టీఆర్ పేదలకు తమ అవసరాలు తీర్చే దేవుడిగా కనిపించారు.

ఎన్టీఆర్ రాక కోసం ప్రజలు రోజుల తరబడి వేచి చూశారు. ప్రచారంలో కూడా.. జనం మధ్యే భోజనం.. జనం మధ్యే స్నానపానాదులు.. జనం మధ్యనే నిద్ర.. ఇలా రాష్ట్రమంతా పర్యటించి తొలి ఎన్నికల్లోనే.. అదీ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకే సూపర్ హిట్ కొట్టి… తెలుగువాడి సత్తా ఏంటో కాంగ్రెస్‌కు రుచి చూపించారు. ఈ రికార్డు ఇప్పటికీ ఎప్పటికీ అలాగే ఉంటుందనేది తెలుగుదేశం పార్టీ నేతల మాట.

Also Read : గులాబీ పార్టీలో కాళేశ్వరం కలవరం.. ఫాం హౌస్ కు హరీష్

ముఖ్యమంత్రి అవ్వగానే… ఆంధ్రులకు మదరాసీలుగా ఉన్న పేరును చెరిపేస్తూ.. తెలుగువాళ్ల స్వాభిమానానికి అంకురార్పణ చేశారు. ఆనాటి నుంచి ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ తెలుగునాట బలమైన రాజకీయ శక్తిగా అప్రహతిహతంగా కొనసాగుతుందంటే.. దానికి అన్నగారు వేసిన పటిష్ట పునాదులు.. తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు.. అమలు చేసిన సంక్షేమ పథకాలే మూల కారణం. అన్నగారి పాలన ఎలా ఉండబోతోందన్నది ఆయన ప్రమాణ స్వీకారం నాడే ప్రజలకు అర్థమైంది. అప్పటి వరకూ పనిచేసిన ముఖ్యమంత్రులంతా.. రాజ్ భవన్‌లోనే నాలుగు గోడల మధ్య ప్రమాణ స్వీకారం చేసేవాళ్లు. కానీ ఎన్టీఆర్ మాత్రం… 1983 జనవరి 9.. ఆంధ్రప్రదేశ్ పదవ ముఖ్యమంత్రిగా, తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా.. తనను ఆదరించిన ప్రజల సమక్షంలోనే ప్రమాణస్వీకారం చేసి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.

దేశరాజకీయాల్లోనే అనితర సాధ్యమైన విజయం.. పార్టీలో కానీ, రాష్ట్రంలో కానీ తనను ప్రశ్నించే వారే లేరు. ముఖ్యమంత్రిగా తానేం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా చెల్లుతుంది. ఇలాంటి స్థానంలో మరో వ్యక్తి ఉండి ఉంటే.. ఎలా ఉండేవారో తెలియదు కానీ, అన్నగారు మాత్రం ప్రజాస్వామ్య విలువలకే పెద్ద పీట వేశారు. పరిపాలనలో పారదర్శకత, నీతి నిజాయతీలకు మారుపేరుగా నిలిచారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్లారు. పార్టీలో భజన పరుల్ని పాలనలో ఆమడ దూరంలో పెట్టారు. లాబీయింగ్‌, లావాదేవీలు, సిఫార్సులు, కోటరీలు వంటి పదాలు సచివాలయం దరిదాపుల్లో కూడా వినిపించేవి కాదు. ఆయన వారసుల్లో ఒక్కరిని కూడా సచివాలయం వైపు రానివ్వలేదు. ఏదైనా ఫైళ్లకు సంబంధించిన విషయాల్లో ఎవరి సిఫార్సులు కూడా పరిగణనలోకి తీసుకునే వారు కాదు.

Also Read : భయం భయంగా బెజవాడ.. మళ్ళీ ఎందుకీ అలజడి..?

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఆయన కుమారుడు జయకృష్ణ స్కూటర్ పోయింది. దీంతో జయకృష్ణే స్వయంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైట్ ఇచ్చారు. ఫిర్యాదులో తన తండ్రి పేరు రాసే వరకూ.. ఆయన ముఖ్యమంత్రి కొడుకు అని స్టేషన్‌లో ఎవరికీ తెలియలేదంట.. అదీ అన్నగారి స్టైల్. దట్ ఈజ్ ఎన్టీఆర్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్