టీమిండియా సెమీఫైనల్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నప్పటికీ, జట్టు ప్రదర్శనపై అభిమానుల్లో ఆందోళన పెరుగుతోంది. వెస్టిండీస్పై జరిగే తదుపరి మ్యాచ్లో విజయం సాధిస్తే సెమీస్ బెర్త్ ఖాయం కానున్న నేపథ్యంలో, ప్రతి నిర్ణయం కీలకంగా మారింది. అయితే ఇటీవల జరిగిన మ్యాచ్లో భారత్కు మంచి నెట్ రన్ రేట్ సాధించే అవకాశం ఉన్నప్పటికీ, దాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోవడం పెద్ద లోపంగా మారింది. ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో చిన్న తప్పిదాలే పెద్ద ప్రభావం చూపుతాయని మరోసారి స్పష్టమైంది.
Also read : పయ్యావుల వర్సెస్ మండలి చైర్మన్..!
ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. నెట్ రన్ రేట్ ప్రాముఖ్యత తెలిసినా, కీలక సమయంలో అనవసర ప్రయోగాలకు ప్రాధాన్యం ఇవ్వడం అభిమానులను నిరాశపరిచింది. స్పెషలిస్ట్ బౌలర్లైన హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలను పూర్తిగా వినియోగించకుండా, దూబేకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడం మ్యాచ్ మలుపు తిరిగేలా చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయాలపై సోషల్ మీడియాలో సూర్యకుమార్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also read : సెన్సార్ బోర్డుకు మైండ్ లేదా..? హైకోర్ట్ సంచలన కామెంట్స్..!
భారత్ బౌలింగ్ విభాగం కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడం మరో ఆందోళనకర అంశం. పసలేని బౌలింగ్తో ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం సాధించడం కష్టమవుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ కప్ గెలవాలంటే కేవలం బ్యాటింగ్ బలం సరిపోదని, కట్టుదిట్టమైన బౌలింగ్ మరియు స్పష్టమైన వ్యూహం అవసరమని సూచిస్తున్నారు.
ఇక ముందు జరిగే వెస్టిండీస్ మ్యాచ్ టీమిండియాకు డూ ఆర్ డైగా మారింది. అనవసర ప్రయోగాలను పక్కనపెట్టి, అనుభవజ్ఞులైన ఆటగాళ్లను సమర్థంగా వినియోగిస్తేనే సెమీస్ ప్రయాణం సాఫీ అవుతుంది. అభిమానుల ఆశలు నిలబెట్టుకోవాలంటే జట్టు సమష్టిగా బాధ్యత తీసుకుని మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. వెస్టిండీస్ తో మ్యాచ్ లో గెలిస్తే నేరుగా సెమీస్ కి.. లేకపోతే ఇంటికే అన్న విషయం జట్టు సభ్యులు గుర్తుపెట్టుకుని ఆడితే ఘన విజయం సాధ్యమే.

