Wednesday, February 4, 2026 07:44 PM
Wednesday, February 4, 2026 07:44 PM

కావాలనే తగలబెట్టారా..? కేంద్ర హోంశాఖకు నివేదిక

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. పదేళ్ల క్రితం పనులకు శంకుస్థాపన చేసిన మోడీ మరోసారి పున ప్రారంభానికి హాజరు కావడం పలు పనులకు శంకుస్థాపన చేయడం వంటివి జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీల కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగానికి కూడా విశేష స్పందన వచ్చింది.

Also Read : లోకేష్‌ పదవిపై ఫుల్ క్లారిటీ..!

అమరావతి పనులు మరింత వేగవంతం అవుతాయని సంకేతాలు కూడా వెళ్లాయి. ఇదిలా ఉంచితే ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న రెండు ఘటనలు ఆశ్చర్యం కలిగించాయి. ప్రధానమంత్రి గన్నవరం విమానాశ్రయంలో దిగే సమయానికి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం సంచలనమైంది. విమానాశ్రయం కోసం సేకరించిన భూముల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి 7 ఎకరాల్లో చెట్లు కాలిపోయాయి. ఇక ఆ తర్వాత ప్రధానమంత్రి హెలికాఫ్టర్ లో సభా స్థలానికి చేరుకునే సమయానికి చోటు చేసుకున్న ఘటనలో.. పెద్ద ఎత్తున ఎల్ అండ్ టి కంపెనీకి చెందిన పైపులు కాలిపోయాయి.

Also Read : రామ్ చరణ్ ను “గ్లోబల్ స్టార్” ట్యాగ్ భయపెడుతోందా..?

రెండు సందర్భాల్లో కూడా మోడీ.. దిగుతున్న సమయానికే మంటలు చెలరేగడం ఆశ్చర్యం కలిగించింది. దీనికి సంబంధించిన వీడియోలు పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సరిగ్గా మోడీ వచ్చే సమయానికి కావాలనే కొంతమంది మంటలు చెలరేగేలా ప్రణాళిక ప్రకారం.. చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఇక దీనిపై ప్రధానమంత్రి భద్రత అధికారులు కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎన్ ఎస్ జి అధికారులు కేంద్ర హోంశాఖకు నివేదిక పంపారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్