Friday, September 12, 2025 05:16 PM
Friday, September 12, 2025 05:16 PM
roots

హీరోకు 300 కోట్లు.. అభిమానుల జేబులకు మాత్రం చిల్లు

మరో రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న పుష్ప టు సినిమా టికెట్ ధరల విషయంలో సినిమా మేకర్స్ తీసుకున్న నిర్ణయం పై ఇప్పుడు తీవ్రస్థాయి విమర్శలు వస్తున్నాయి. దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకారం తెలపడంతో భారీగా టికెట్ ధరలను పెంచేశారు. దీనితో అల్లు అర్జున్ అభిమానులు కూడా టికెట్ ధరలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. బెనిఫిట్ షో ధరలు భారీగా ఉండటంతో మిడిల్ క్లాస్ వాళ్ళు సినిమా చూడటం కష్టమని అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు వెళ్లాలి అనుకుంటే తడిచి మోపెడు కావడం ఖాయం అని ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

Also Read : రాజకీయ శరణార్థిగా గుర్తించండి.. ప్రభాకర్ రావు సంచలన ట్విస్ట్

ఈ నేపద్యంలో ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరల పెంపుపై కూడా పుష్ప సినిమా మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను సినీ నిర్మాత అల్లు అరవింద్ కలిసి ఈ అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే పుష్ప సినిమా మేకర్స్ కూడా అమరావతి వచ్చి పవన్ కళ్యాణ్ తో భేటీ కావడానికి సిద్ధమవుతున్నారు. దీనితో తెలంగాణతో పాటుగా ఏపీలో కూడా ధరలు భారీగా పెరిగే అవకాశం కనబడుతోంది. ఇదే జరిగితే మాత్రం తొలి నాలుగు రోజులు సినిమాకు వసూళ్లు పడిపోయే అవకాశం ఉంది అని కామెంట్స్ కూడా వినపడుతున్నాయి.

మిడిల్ క్లాస్ అలాగే మాస్ ఆడియన్స్ సినిమా చూడాలి అంటే ధరలు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. దాదాపుగా 250 రెట్లు సినిమా టికెట్ ధరలను పెంచడం పట్ల ఇప్పుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. మల్టీప్లెక్స్ లో 550లో టికెట్ ధర ఉండటం పట్ల అల్లు అర్జున్ అభిమానులే ఆగ్రహంగా ఉన్నారు. ఇక బెనిఫిట్ షోల పేరుతో నాలుగో తారీఖు సాయంత్రం నుంచే సినిమా ప్రదర్శన మొదలుకానుంది. వీటికి కూడా భారీగా అభిమానుల నుంచి వసూలు చేయాలి అనుకోవడం విమర్శలకు దారితీస్తోంది.

Also Read : బియ్యం మాఫియా పై పవన్ ఫైర్.. కాకినాడ పోర్టులో పవన్ తుఫాన్

కర్ణాటక మహారాష్ట్రలో కూడా పుష్పా టికెట్ ధరల విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సినిమాకు ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా వసూలు చేయాలి అనుకోవడం ఏవిధంగా భావ్యమంటూ పలువురు మండిపడుతున్నారు. స్టార్ హీరోలకు నిర్మాతలు భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చి అభిమానుల నుంచి ఆ సొమ్ముని వసూలు చేసుకోవాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్