Sunday, October 26, 2025 07:14 AM
Sunday, October 26, 2025 07:14 AM
roots

బాలీవుడ్ లో దేవరకు గేటు క్లోజ్..?

ఈ రోజుల్లో పాన్ ఇండియా లెవెల్ లో ఒక్క సినిమా హిట్ అవ్వగానే.. పాన్ ఇండియా స్టార్ అనేస్తున్నారు. ఫ్యాన్స్ ఎలివేషన్లు కూడా అదే రేంజ్ లో ఉంటున్నాయి. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు సౌత్ ఇండియాలో ఇదే ట్రెండ్ నడుస్తోంది. భారీ బడ్జెట్, పాన్ ఇండియా.. ఈ రెండు ట్యాగ్ లతో సినిమాకు హైప్ పెంచేస్తున్నారు. ఇలా పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్.. లక్కీగా వార్ 2 అనే భారీ బడ్జెట్ సినిమాలో ఛాన్స్ కొట్టేసాడు. కెరీర్ లో మొదటిసారి నెగటివ్ రోల్ లో కనిపించాడు.

Also Read : సెట్స్ లో వంట చేస్తున్న శోభిత ధూళిపాళ

ఆ రోల్ ఎన్టీఆర్ కు బాగా ప్లస్ అవుతుందని, బాలీవుడ్ లో డామినేషన్ స్టార్ట్ అవుతుందని ఫ్యాన్స్ చాలా ఊహించారు. ఇక నిర్మాత కూడా ఎన్టీఆర్ కు భారీ రెమ్యునరేషన్ ఇవ్వడంతో.. ఎన్టీఆర్ రేంజ్ పెరిగిందని ఊహించారు ఫ్యాన్స్. కానీ ఆ సినిమా బోల్తా పడింది. కనీసం పెట్టుబడి కూడా రాలేదు. ఇటు తెలుగులో కూడా భారీగా ఖర్చు పెట్టి కొన్నా సరే.. ఎన్టీఆర్ ఇమేజ్ వర్కౌట్ కాలేదు. వాస్తవానికి ఎన్టీఆర్ ఇమేజ్ తో భారీగా లాభాలు వస్తాయని, తెలుగు, కన్నడలో ఎన్టీఆర్ బ్రాండ్ కాపాడుతుందని యష్ రాజ్ ఫిలిమ్స్ అంచనా వేసింది.

Also Read : హరీష్ ఇంట్లోనే కేటిఆర్.. జాగ్రత్త పడుతున్న చిన్న సారు..!

కానీ సినిమాలో పస లేకపోవడం, దానికి తోడు ఎన్టీఆర్ రోల్ కూడా కామెడిగా ఉందనే టాక్ రావడంతో లాభాలు కాదు.. పెట్టుబడి కూడా రాలేదు. దీనితో ఎన్టీఆర్ కు ఇక బాలీవుడ్ దారులు మూసుకుపోయినట్టే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. దేవర సినిమా సౌత్ లోని కర్ణాటక, తమిళనాడులో బాగా ఆడింది. హిందీలో కరణ్ జోహార్ కు నష్టాలు మిగిల్చింది. దీనితో ఎన్టీఆర్ బొమ్మకు బాలీవుడ్ లో అంత వెయిట్ లేదనే క్లారిటీ వచ్చేసింది అంటున్నాయి సినీ వర్గాలు. మరి ఫ్యూచర్ లో ఎన్టీఆర్ ప్లాన్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

సస్పెండ్ చేస్తే తిరువూరు...

తిరువూరు నియోజకవర్గం టీడీపీలో అలజడి కొనసాగుతోంది....

పులివెందులకు కేంద్రం గుడ్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

వరల్డ్ కప్‌కు మేం...

గత నాలుగు నెలల నుంచి భారత...

రోహిత్ రికార్డుల మోత.....

భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా ఓపెనర్...

ఒక్కొక్కరికి కోటి ఇచ్చే...

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాతి...

హైడ్రా కమీషనర్ రంగనాథ్...

హైదరాబాద్‌లోని హైడ్రా కమీషనర్ రంగనాథ్ శుక్రవారం...

పోల్స్