Wednesday, February 4, 2026 04:30 PM
Wednesday, February 4, 2026 04:30 PM

భారతీయులకు దుబాయ్ గుడ్ న్యూస్..!

విదేశాల్లో స్థిరపడాలి అని భావించే వారికి మరో దేశం గుడ్ న్యూస్ చెప్పింది. అమెరికా తరహాలోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తన నూతన రెసిడెన్సీ పాలసీని అన్ని రంగాల నిపుణులకు మరింత అందుబాటులోకి తెచ్చింది. ఈ గల్ఫ్ దేశం.. నామినేషన్ ను బేస్ చేసుకుని.. కొత్త రకం గోల్డెన్ వీసాను ప్రవేశపెట్టింది. కొన్ని షరతులతో ఈ వీసాను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలో వ్యాపారంలో పెద్ద మొత్తం పెట్టుబడి పెట్టే వారికి మాత్రం కాకుండా ఇతరులకు కూడా ఇవ్వడానికి సిద్దపడింది ఆ దేశం.

Also Read : అప్పుడు లేని నొప్పి ఇప్పుడు ఎందుకు..? మస్క్ పై ట్రంప్ సీరియస్

ఈ గోల్డెన్ వీసా నర్సులు, విద్యావేత్తలు, కంటెంట్ క్రియేటర్లను లక్ష్యంగా చేసుకుని ప్రవేశపెట్టారు. 2019లో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని మొదట.. మొదట రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెట్టే వారి కోసం తీసుకొచ్చారు. 2022లో, 10 సంవత్సరాల వీసా కోసం కనీస ఆస్తి పరిమితిని AED 2 మిలియన్లకు తగ్గించారు. దీనితో పెద్ద ఎత్తున ఆ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఇతర వ్యాపారాలకు కూడా దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం.

Also Read : ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 7వ తరగతి బాలిక చిచ్చు

ఉన్నత చదువులు చదివే విద్యార్ధులకు కూడా మే నెలలో గోల్డెన్ వీసాను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు, కార్యనిర్వాహకులు, ఫ్రంట్‌లైన్ కార్మికులు, పాఠశాల ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌లు మరియు విశ్వవిద్యాలయ అధ్యాపకులు, 15+ సంవత్సరాల అనుభవం ఉన్న నర్సులు, యూట్యూబర్‌లు, పాడ్‌కాస్టర్‌లు, డిజిటల్ క్రియేటర్లు, 25 ఏళ్లు పైబడిన గుర్తింపు పొందిన ఇ-స్పోర్ట్స్ నిపుణులు, లగ్జరీ యాచ్ యజమానులు సహా తదితరులకు గోల్డెన్ వీసాను అనుమతించారు. ఈ నిర్ణయం భారతీయులకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్