Monday, October 27, 2025 10:44 PM
Monday, October 27, 2025 10:44 PM
roots

పెద్దిరెడ్డిని కాపాడుతున్న అధికారులు

ఏపీలో వైసీపీ నేతలకు అధికారుల నుంచి పూర్తిగా రక్షణ దొరుకుతోంది. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అక్రమాలకు, అవినీతి కార్యక్రమాలకు పాల్పడిన వైసిపి కీలక నేతలు ఇప్పుడు అధికారుల నుంచి రక్షణ పొందుతున్నారు. అక్రమాలకు పాల్పడ్డారని సాక్షాదారాలు ఉన్నా సరే కొంతమంది అధికారులు మాత్రం వైసీపీ నేతలు విషయంలో చూసి చూడనట్లు వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వైసిపి అధికారంలో ఉన్న సమయంలో టిడిపి నేతలు ఎటువంటి అక్రమాలకు పాల్పడకపోయినా కొంతమందిని వ్యక్తిగత కక్షలతో అరెస్టు చేసిన సందర్భాలు ఉన్నాయి.

Also Read : కావాలనే తగలబెట్టారా..? కేంద్ర హోంశాఖకు నివేదిక

ఇప్పుడు వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారు అనే సాక్షాలను బయటపెడుతున్న సరే రెవెన్యూ శాఖ అధికారులతో పాటుగా అటవీ శాఖ అధికారులు అలాగే పోలీసులు వారికి పూర్తిగా సహకారం అందిస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో రెవిన్యూ శాఖ అధికారులు అనుసరిస్తున్న వైఖరి వివాదాస్పదమవుతుంది. తిరుపతిలోని బుగ్గమఠం భూముల సర్వే విషయంలో రెవెన్యూ శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

Also Read : తోపుదుర్తి సేవలో రాప్తాడు పోలీసులు

దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అధికారులు సర్వే నిర్వహించాలని స్పష్టంగా చెప్పింది. భూములను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించారని సాక్ష్యాలను సేకరించినా సరే రెవెన్యూ శాఖ అధికారులు కానీ పోలీసులు గాని సర్వే నిర్వహించేందుకు రాలేదు. ఇప్పటివరకు పలుమార్లు ఈ సర్వే ని వాయిదా వేస్తూ వచ్చారు.. ఈరోజు ఎలాగైనా సరే సర్వే చేయాలని నిర్ణయించారు అధికారులు. అయినా సరే భూముల వద్దకు మాత్రం వెళ్లేందుకు రెవిన్యూ అధికారులు సాహసం చేయలేకపోతున్నారు. అటు పెద్దిరెడ్డి అనుచరుల నుంచి రెవెన్యూ అధికారులకు ఇబ్బందులు ఉన్నా సరే పోలీసుల నుంచి సహకారం లేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్