Friday, September 12, 2025 05:16 PM
Friday, September 12, 2025 05:16 PM
roots

ఏపీ అసెంబ్లీలో ధూళిపాళ్ళ మరో సంచలనం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వ అవినీతి వ్యవహారాలపై కూటమి సర్కార్ ఆసక్తికర విషయాలు బయటపెడుతోంది. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న కొన్ని అవినీతి వ్యవహారాలను ఇటీవల టీడీపీ ఎమ్మెల్యేలు బయటపెడుతున్నారు. ఇటీవల సహకార బ్యాంకుల్లో రుణాల వవహారాన్ని బయట పెట్టిన ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్.. తాజాగా మరో అంశాన్ని సభలో లేవనెత్తారు. మొబైల్ వెటర్నరీ క్లినిక్కుల కొనుగోళ్లల్లో గత ప్రభుత్వంలో జరిగిన కుంభకోణంపై అసెంబ్లీలో ప్రస్తావించారు.

Also Read : రాజకీయ అనాధలకు బిజెపి ఆశ్రయం

మొత్తం 340 మొబైల్ వెటర్నరీ క్లినిక్కుల కొనుగోళ్లల్లోని అవకతవకలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ధూళిపాళ్ళ నరేంద్ర ప్రశ్నించారు. రెండు విడతల్లో మొబైల్ వెటర్నరీ క్లినిక్కులను కొనుగోలు చేస్తే.. మొదటి, రెండో విడతల ధరల్లోనే భారీ వ్యత్యాసం ఉందని సభ దృష్టికి తీసుకొచ్చారు. మొదటి, రెండో విడతల్లోనే ప్రతి మొబైల్ యూనిట్టుకు రూ. 14 లక్షలు వ్యత్యాసం ఉందన్న ధూళిపాళ్ళ. పొరుగు రాష్ట్రాల్లో రూ. 16 లక్షలకే మొబైల్ యూనిట్లు కొనుగోళ్లు చేస్తే.. ఏపీలో గత ప్రభుత్వెలో రూ. 82 లక్షలకు కొనుగోలు చేశారంటూ ఆయన తీవ్ర విమర్శలు చేసారు.

Also Read : రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఆ రైళ్లు సికింద్రాబాద్ కు రావు..!

ఆపరేటింగ్ కాస్ట్ పేరుతో భారీ ఎత్తున దోపిడీకి గత ప్రభుత్వం తెర లేపిందని ధూళిపాళ్ళ వెల్లడించారు. గత ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారుల కుమ్మక్కుతోనే నాటి ప్రభుత్వ పెద్దలు భారీ దోపిడీకి తెర లేపారన్న ధూళిపాళ్ళ.. ఆర్కేవీవై నిధులను దారి మళ్లించి మొబైల్ యూనిట్లను కొనుగోళ్లు చేశారన్న అంశం పైనా విచారణకు డిమాండ్ చేసారు. ఇక మిర్చి యార్డ్ లో జరిగిన కొన్ని అక్రమాలపై కూడా ఆయన నేడు సభలో ప్రస్తావించారు. టీడీపీ ఆఫీస్ పై జరిగిన దాడికి కుట్ర జరిగింది గుంటూరు మిర్చి యార్డులోనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్