Tuesday, October 21, 2025 07:23 PM
Tuesday, October 21, 2025 07:23 PM
roots

చంద్రబాబు ముందుకు అసెంబ్లీ అటెండెన్స్..? ఎమ్మెల్యేలపై చర్యలు..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గతంలో కంటే కాస్త భిన్నంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులందరూ హాజరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా ఎమ్మెల్యేలు అందరూ నియోజకవర్గాలను వదిలి సమావేశాల్లో పాల్గొనడం చూస్తూనే ఉన్నాం. ఇక మంత్రులు కూడా అసెంబ్లీ సమావేశాలను తప్పించుకోవడం లేదు. అయితే ఎమ్మెల్యేల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిఘా పెట్టింది. ఎమ్మెల్యేలకు సంబంధించి గతంలో ఎప్పుడూ లేనివిధంగా కాస్త కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.

Also Read : ఆ స్టార్ హీరో కార్ల కలెక్షన్ తెలుసా..?

అసెంబ్లీ సమావేశాలను తేలికగా తీసుకునే వాళ్లకు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా రిజిస్టర్ లో సంతకం పెట్టి వెళ్లిపోతున్నారని.. విజయవాడ హోటల్స్ లో లేదంటే.. గుంటూరు హోటల్స్ లో ఉంటూ వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారని గుర్తించారు. కీలకమైన చర్చలు జరుగుతున్న సమయంలో అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు సభలో లేరు. సాగునీటిపై మాట్లాడే సమయంలో ఎమ్మెల్యేలు సభలో లేకపోవడాన్ని సీఎం చంద్రబాబుతో పాటుగా ఒక ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకున్నట్లు అసెంబ్లీ వర్గాలు అంటున్నాయి.

Also Read : గర్భంతో ఉంటే బొప్పాయి తినవచ్చా..? కుంకుమ పువ్వు సెంటిమెంట్ నిజమేనా..?

అలాగే కొంతమంది ఎమ్మెల్సీలు కూడా సభకు రావడం లేదని ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఎవరైనా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే ముందుగా ప్రభుత్వ పెద్దలకు సమాచారం ఇవ్వడం ఆనవాయితీ. కానీ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు మాత్రం కాస్త భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సభలో నామమాత్రంగా ఉండటం లేదా సంతకం పెట్టి వెళ్లిపోవడం వంటివి జరుగుతున్నాయి. అటు జనసేన, బిజెపి ఎమ్మెల్యేల తీరు కూడా ఇలాగే ఉంది. దీనితో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభకు రాని ఎమ్మెల్యేల జాబితా అలాగే అటెండెన్స్ రిజిస్టర్ నుంచి సమాచారాన్ని తెప్పించుకున్నట్లు.. తెలుస్తోంది. అటు స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఆ పదవులు ఎప్పుడు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే...

వాళ్ళను వదలొద్దు.. చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర...

ఉప్పు, పప్పు కూడా...

ఇద్దరు అధికారులు తన్నుకుంటే.. అది ఏమవుతుందో...

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

పోల్స్