Wednesday, February 4, 2026 11:30 PM
Wednesday, February 4, 2026 11:30 PM

చంద్రబాబుకు కేంద్రంలో కీలక బాధ్యతలు

ఏపీ సిఎం చంద్రబాబుకు బిజెపి అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించనుందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. హర్యానా ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడం పట్ల ఆ పార్టీ అధిష్టానం ఇప్పుడు నూతన ఉత్సాహంతో కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపధ్యంలో ఎన్డియేని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యత తగ్గించిన బిజెపి అధిష్టానం ఇప్పుడు మాత్రం కీలక అడుగులు వేస్తోంది. ఎన్డియేలో త్వరలోనే కొన్ని మార్పులు ఉండే అవకాశం కనపడుతోంది.

రేపు హర్యానా సీఎం ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 12.30 నుంచి 2 వరకు చండీఘడ్ లో జరగనున్న ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరు అవుతారు. మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు చండీఘడ్ లో జరగనున్న ఎన్ డీ ఏ పక్షాల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. తిరిగి రాత్రి కి విజయవాడ చేరుకుంటారు చంద్రబాబు. అయితే ఈ సమావేశంలోనే చంద్రబాబుకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాబోయే పలు రాష్ట్రాల ఎన్నికలు బిజెపికి అత్యంత కీలకం.

Also Read : ఏపీలో మందుబాబులకు పండుగ.. కొత్త రూల్స్ ఇవే

మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలని బిజెపి పట్టుదలగా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికలు బిజెపికి అత్యంత కీలకం. ఈ తరుణంలో ప్రాంతీయ పార్టీలకు ఎన్డియేలో ప్రాధాన్యత పెంచడంతో పాటుగా తమ ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా చూసేందుకు… చంద్రబాబును ఎన్డియే కన్వినర్ గా ఎంపిక చేయాలని బిజెపి పెద్దలు భావిస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబుకు ఆఫర్ ఇచ్చినా ఆయన దానిపై ఆసక్తి చూపలేదు. ఇప్పుడు మాత్రం కచ్చితంగా బాధ్యతలు అప్పగించాలని ప్రధాని మోడీ పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్