Tuesday, September 9, 2025 08:57 PM
Tuesday, September 9, 2025 08:57 PM
roots

గంభీర్ కి చెక్ పెడుతున్న బోర్డ్..? షాకింగ్ నిర్ణయం..!

టీం ఇండియా హెడ్ కోచ్ గా గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సోషల్ మీడియాలో కాస్త విమర్శలు గట్టిగా వచ్చాయి. కొందరు ఆటగాళ్ళపై కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నాడు అనే విమర్శలు వచ్చాయి. మూడు ఫార్మాట్ లకు ముగ్గురు ఆటగాళ్లను కెప్టెన్ లను చేయాలని భావించాడని ప్రచారం జరిగింది. అనుకున్న విధంగానే రోహిత్ శర్మను కెప్టెన్ గా పక్కన పెట్టాడు. వన్డే కెప్టెన్సి పదవి నుంచి కూడా తప్పించే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.

Also Read : అసలు బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది..?

అలాగే జట్టు సెలెక్షన్ విషయంలో కూడా గంభీర్ పెత్తనం ఎక్కువగా ఉందనే వార్తలు వచ్చాయి. శ్రేయాస్ అయ్యర్ విషయంలో కూడా రాజకీయాలు జరిగినట్టు విమర్శలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారాలపై బోర్డు పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ఇద్దరు, ముగ్గురు సీనియర్ ఆటగాళ్ళు కూడా గంభీర్ పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బోర్డుకు కంప్లైంట్ చేసినట్టు సమాచారం. దీనితోనే బోర్డు నష్ట నివారణ చర్యలకు దిగినట్టు వార్తలు వస్తున్నాయి. రాబోయే సీరీస్ లను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

Also Read : రేవంత్ గోప్యతకు కారణం అదేనా..?

ఎంఎస్ ధోనీని జట్టు మెంటార్ గా నియమించాలని భావిస్తోంది బోర్డు. గంభీర్ పెత్తనం తగ్గించాలి అంటే ధోని కరెక్ట్ అని భావిస్తోన్న బోర్డు పెద్దలు.. ఆసియా కప్ నుంచే ధోనీని మెంటార్ గా నియమించే దిశగా అడుగులు వేస్తోంది. అటు ధోనీ కూడా ఈ నిర్ణయానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఇదే సమయంలో తమిళనాడుకు చెందిన ఓ మాజీ క్రికెటర్ కు బోర్డు అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత గంభీర్ పై విమర్శలు వచ్చాయి. ఇంగ్లాండ్ పర్యటనలో జట్టు ఎంపికపై కూడా బోర్డు సీరియస్ అయింది. ఇక తనకు నచ్చిన ఆటగాళ్లే తుది జట్టులో ఉంటున్నారనే ఆరోపణ వచ్చింది. కుల్దీప్ యాదవ్, అభిమన్యు ఈశ్వరన్ వంటి వారికి చోటు కల్పించకపోవడంపై బోర్డు సీరియస్ అయినట్టు సమాచారం. వీటిపై మీడియా కూడా ఫోకస్ చేయడంతోనే.. జట్టు జాగ్రత్తలు పడుతున్నట్టు క్రికెట్ వర్గాలు అంటున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఈవీఎంలా..? బ్యాలెట్టా..? చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో...

దుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాలు..!

దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి...

జగన్‌కు షాక్.. వైసీపీలో...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుస...

మాకు ఈ పదవులు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర...

గ్లాస్ స్కై వాక్...

ఏదైనా మంచి జరిగితే.. అది మా...

రేవంత్ గోప్యతకు కారణం...

రాజకీయాల్లో తెలంగాణ కాంగ్రెస్ కాస్త డిఫరెంట్...

పోల్స్