Thursday, March 26, 2026 08:51 PM
Thursday, March 26, 2026 08:51 PM

మెగా ఫ్యామిలీపై అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్..!

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా సోషల్ మీడియాలో చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. మెగా కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఓ పోస్ట్ షేర్ చేసారు. అన్నా లెజినోవా సోషల్ మీడియాలో కాస్త తక్కువగానే కనపడుతూ ఉంటారు. అయితే తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఒక సుదీర్ఘమైన పోస్ట్ చూసి మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, తన భర్త పవన్ కల్యాణ్‌ తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంటూ ఆమె తన మనసులోని మాటను బయటపెట్టారు.

Also Read : ఘోర ప్రమాదం.. కాలి బూడిదైన బతుకులు..!

తాను మెగా కుటుంబంలోకి అడుగుపెట్టి దాదాపు 15 ఏళ్లు కావస్తోందని అన్నా లెజినోవా గుర్తుచేసుకున్నారు. మొదట్లో ఇంత పెద్ద కుటుంబంలోకి వచ్చినప్పుడు నాకు చాలా భయం వేసింది. అసలు ఇంతమందిలో నేను ఎలా ఇమడగలను..? ఎలా కలిసిపోగలను..? అని అర్థం కాలేదు.. అంటూ తన తొలిరోజుల అనుభవాలను పంచుకున్నారు. తెలుగు సంప్రదాయాలు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న బాంధవ్యాల గురించి తనకు ఏమీ తెలియదని ఆమె పేర్కొన్నారు. కానీ నా భర్త పవన్ కల్యాణ్ నాకు ప్రతి విషయంలో తోడుగా నిలిచారని కొనియాడారు.

Also Read : ఆ రెండు జిల్లాలే పవన్ నయా టార్గెట్..!

ఎవరిని ఎలా పిలవాలి..? ఎవరితో ఎలా ఉండాలి..? అనేది ఆయనే నాకు నేర్పించారన్నారు. ఆయన సహకారం వల్లే నేను ఈ కుటుంబంలో ఒక భాగం కాగలిగానని ఆమె రాసుకొచ్చారు. తనకు సొంతంగా సోదరులు లేరని, కానీ మెగా కుటుంబంలోకి వచ్చాక ఆ లోటు తీరిందన్నారు. చిరంజీవి, నాగబాబులో తాను తన అన్నయ్యలను చూసుకుంటున్నాను అని, వారిద్దరూ నన్ను చెల్లెలిలా ఆదరిస్తారని ఎమోషనల్ అయ్యారు. కాగా పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక, అన్నా లెజినోవా తరచూ మెగా ఫ్యామిలీ వేడుకల్లో కనిపిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అమరావతి చట్టబద్దత.. వైసీపీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ...

ప్రజల గుండెల్లో ఎన్టీఆర్...

కుప్పం నియోజకవర్గంలో పరిశ్రమల రాకతో అభివృద్ధికి...

అమరావతి అగ్నిప్రమాదాలపై ఏపీ...

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని...

ఆ రెండు జిల్లాలే...

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ...

బ్రేకింగ్: జగన్ కు...

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్...

పెద్దిరెడ్డికి బిగుస్తోన్న ఉచ్చు.....

వైసీపీ హయాంలో అన్నీ తానై చెలరేగిపోయి.....

పోల్స్