Wednesday, February 4, 2026 06:36 PM
Wednesday, February 4, 2026 06:36 PM

దుమ్ము రేపారు… ఆస్ట్రేలియాకు పగలే చుక్కలు

పెర్త్ వేదికగా జరుగుతున్న… బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్‌ లో భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాపై 46 పరుగుల లీడ్ సాధించిన టీం ఇండియాకు ఓపెనర్లు కెఎల్ రాహుల్, జైస్వాల్ కళ్ళు చేదిరిపోయే ఓపెనింగ్ భాగస్వామ్యం అందించారు. లంచ్ సమయానికి ఆస్ట్రేలియా ఆల్ అవుట్ కాగా… చివరి రెండు సెషన్‌లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా భారత్ బ్యాటింగ్ చేసింది. యశస్వి జైస్వాల్ 90 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఆస్ట్రేలియా గడ్డపై తొలి సెంచరీ దిశగా అడుగులు వేస్తున్నాడు.

Also Read : కంగారులను కంగారు పెట్టేసారు… చుక్కలు చూపించిన పేస్ త్రయం

రాహుల్ కూడా తన అర్ధ సెంచరీ సాధించి మంచి ఊపు మీదున్నాడు. మ్యాచ్ ముగిసే సమయానికి రాహుల్ 62 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. వీరిద్దరూ 2వ రోజు ముగిసే సమయానికి భారత్ కు మంచి ఆధిక్యం అందించారు. 172 పరుగులు చేసిన ఈ జోడీ… ఆధిక్యాన్ని 218 పరుగులకు పెంచింది. ఇంకా 10 వికెట్లు చేతిలో ఉన్నాయి. దీనితో భారత్… భారీ లక్ష్యాన్ని ఆసిస్ ముందు ఉంచే అవకాశం కనపడుతోంది. ఇక పిచ్ స్వభావం క్రమంగా మారుతోంది. మొదటి రోజు 17 వికెట్ లు పడితే రెండవ రోజు కేవలం మూడు మాత్రమే పడ్డాయి.

Also Read : బరితెగించిన నాటి జగన్ సర్కార్.. ఇదిగో మరో ఆధారం

క్రమంగా బ్యాటింగ్ అనుకూలిస్తున్న పిచ్ పై పగుళ్ళు పెరిగే అవకాశం ఉంది. పెర్త్ లో ఎండ తీవ్రత పిచ్ పై పగుళ్ళకు కారణం కానుందని అంచనా వేస్తున్నారు. అంతకుముందు కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగి… ఆస్ట్రేలియా పతనం శాసించాడు. హర్షిత్ రాణా మూడు వికెట్లు తీసుకున్నాడు. ఆస్ట్రేలియాను 104 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్… క్రమంగా మ్యాచ్ లో విజయం దిశగా అడుగులు వేస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో క్రీజ్ లో నిలబడటానికి ఇబ్బంది పడ్డ యువ ఓపెనర్ జైస్వాల్… రెండో ఇన్నింగ్స్ లో మాత్రం దుమ్ము రేపాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్